అస్తమించిన “ఏడో చంద్రుడు”

– సుధారాణి

రాచకొండ విశ్వనాథశాస్త్రిని రావిశాస్త్రి అని పిలుస్తారని తెలుగు సాహితీ లోకంలో అందరికీ తెలుసు.

ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తిరీత్యా కూడా న్యాయం పక్షాన నిలబడి తన రచనల ద్వారా సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నించారు. డబ్బు, పలుకుబడి, అధికారమదంతో కొందరు ఇంకొందరికి చేసే దురన్యాయాలను ఎండకడ్తూ ఎన్నో కథలు, నవలలు, కొన్ని నాటకాలు వ్రాశారు.

ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తిరీత్యా కూడా న్యాయం పక్షాన నిలబడి తన రచనల ద్వారా సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నించారు. డబ్బు, పలుకుబడి, అధికారమదంతో కొందరు ఇంకొందరికి చేసే దురన్యాయాలను ఎండకడ్తూ ఎన్నో కథలు, నవలలు, కొన్ని నాటకాలు వ్రాశారు.

జులై 30 రావిశాస్త్రి గారు పుట్టిన రోజు. శ్రీకాకుళం లో 1922 లోనారాయణమూర్తి, సీతామహాలక్ష్మి దంపతులకు జన్మించారు. రావిశాస్త్రి గారికి మహ దేవశాస్త్రి అనే అన్నగారు, నరసింహ శాస్త్రి, సుబ్బారావు అనే తమ్ముళ్ళు, నిర్మల అనే చెల్లెలు ఉన్నారు. తండ్రిగారు కొంతకాలం ప్లీడరుగా పనిచేసి వ్యవసాయం లోకి దిగారు. శాస్త్రి గారి చదువు విశాఖపట్టణం లో సాగింది.

రావిశాస్త్రి గారి తల్లికి సంగీతసాహిత్యాలలో గల పరిచయం పిల్లలపై ముఖ్యంగా శాస్త్రిగారిపై చాలా ప్రభావం చూపింది. సమకాలికమైన పత్రికలు, పుస్తకాలు చదవడం వలన రాజకీయ, సాహిత్య విషయాలతో పరిచయం ఏర్పడింది. సాహిత్యమే కాక సంగీతంలో కూడా రావిశాస్త్రిగారికి మంచి అభిరుచి ఉండేది.

రావిశాస్త్రి గారిని విశ్వంగా ఇంట్లోను, ఆర్వీయస్ గా కోర్టులోను, చాత్రిబాబుగా క్లయింట్లతోను, రావిశాస్త్రిగా పాఠక లోకంలోను పిలవడం చాలా మందికి తెలుసు. కానీ రాచకొండ విశ్వనాథ శాస్త్రిగా అల్పజీవి నవలారచయితగా తెలియక ముందు, శాస్త్రిగారు తన పదహారవ ఏటనే రచనలు చేశారని, చాలా కథలు అప్పటి ప్రముఖ పత్రికలలో అచ్చుపడ్డాయని కొందరికే తెలుసు.

నిజజీవితంలోనే కాక రచయిత గా కూడా రావిశాస్త్రిగారికి బోలెడు మారుపేర్లు. కాంతాకాంత, జాస్మిన్, గోల్కొండ రాం ప్రసాద్, శంకర గిరి గిరిజా శంకరం, అన్ జానా ఇలాంటి పేర్లతో ఎన్నో కథలు వ్రాశారు రావిశాస్త్రి.

రచయితగా తన రచనల తొలిదశ గురించి చెప్తూ రావిశాస్త్రి తన తొమ్మిదవ యేటనే ఒక డిటెక్టివ్ కథను, రసపుత్ర వీరుల గురించి ఒక అసంపూర్తి నవలను వ్రాశానని, కొనసాగింపు తెలియక ఆపేశానని చెప్పారు. ఆయన పదహారవ ఏట 1938 లో దేవుడే చేసాడు అన్న పేరుతో వినోదిని పత్రికలో అచ్చయిన కథ ఆయన తొలి రచన. ప్రేమ ఫలితం, ఉద్యోగం దొరక్కపోతే, మీరే ఆలోచించండి కథలు విద్యార్థి దశలో ప్రచురించబడిన కథలు.

పంజరంలో చిలక, రైలుప్రయాణం పోరుపడలేక, స్వప్నమా సత్యమా మొదలైన కథలు వ్రాసిన రావిశాస్త్రి క్రమంగా రచనా వ్యాసంగం మానుకున్నారు. మంచి కథలు రాయలేకపోతున్నానన్న నిరుత్సాహమే దీనికి కారణం అన్నారు రావిశాస్త్రి. వివాహానంతరం భార్య సోమిదేవమ్మ గారు తన భర్త రచయిత కూడానని తెలిసి ఆశ్చర్యపోతే, ఆవిడని పదే పదే ఆశ్చర్యపరచడం కోసమే కథలు వ్రాసేనన్నారు. అలా దయ్యాలకు ద్వేషాల్లేవు పేరుతో ప్రారంభించిన కథా ప్రస్థానం ఆయన చివరి నవల ఇల్లు వరకు కొనసాగింది.

రావిశాస్త్రి గారి కథలను వస్తురీత్యా గమనించినప్పుడు 1950 తరువాత వ్రాసిన కథలకు, 1970 తరువాత వ్రాసిన కథలకు గణనీయమైన మార్పు కనిపిస్తుంది. కథనం, శిల్పంలో చమత్కారాలు, వర్ణనల విషయం పక్కన పెడితే వస్తువరణలో ఈ తేడా కనిపిస్తుంది.

రకరకాల మారుపేర్లతో కథలను వ్రాస్తూ వచ్చిన రావిశాస్త్రి అయ్యారే బాబారే పేరుతో వ్రాసిన నవలను భారతి పత్రిక నాలుగు నెలల పాటు ధారావాహికంగా అల్ప జీవి గా పేరు మార్చి ప్రచురించింది. రాచకొండ విశ్వనాథశాస్త్రి పేరు శ్రీశ్రీ, పురిపండా లాంటి సాహితీ దిగ్గజాలను ఆకర్షించింది.

రకరకాల మారుపేర్లతో కథలను వ్రాస్తూ వచ్చిన రావిశాస్త్రి అయ్యారే బాబారే పేరుతో వ్రాసిన నవలను భారతి పత్రిక నాలుగు నెలల పాటు ధారావాహికంగా అల్ప జీవి గా పేరు మార్చి ప్రచురించింది. రాచకొండ విశ్వనాథశాస్త్రి పేరు శ్రీశ్రీ, పురిపండా లాంటి సాహితీ దిగ్గజాలను ఆకర్షించింది. రచయిత విశాఖ వాస్తవ్యుడని తెలిసి విశాఖ రచయితల సంఘం ఆహ్వానించింది.

విశాఖ రచయితల సంఘంలో బలివాడ కాంతారావు, కాళీపట్నం రామారావు, అంగర సూర్యారావు వంటి వారి పరిచయం రావిశాస్త్రిలోని రచయితకి కొత్తచూపునిచ్చింది. కేవలం తను రచయితగా గుర్తించబడాలన్న కోరిక మాత్రమే నేపథ్యంగా ఉన్న కథారచనకి ఒక ప్రయోజనం, నిబద్ధత ఉండాలనుకోవడంతో పరిణామం చెందింది. తనదైన ఒక దృక్పథాన్ని నిర్దేశించుకోవడానికి బీజం వేసింది విశాఖ రచయితల సంఘం.

విశాఖ నాటక కళా మండలి, సహవిద్యార్థి అబ్బూరి వరదరాజేశ్వరావు స్థాపించిన నటాలి సంస్థ నటుడిగానే కాక నాటక ప్రయోక్తగా కూడా రావిశాస్త్రిని మలిచాయి. గురజాడ కళాకేంద్రం స్థాపించి వచ్చేకాలం, నిజం నాటకాలను రచించి ప్రదర్శించారు .

1950 – 1960 మధ్య వ్రాసిన ఎన్నోకథలలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జీవన చిత్రణే కథావస్తువు. ఈ వర్గానికి చెందిన వారి జీవితాలలోని సమస్యలు, వాటికి కారణాలను వెతుకుతూ అందులోని జీవనవైఫల్యం, అంతర్లీనంగా ఉన్న విషాదం, మానవ సంబంధాలను ఆర్థిక కారణాలు ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తూ సాగిన ఈ కథల పై రావిశాస్త్రి అభిప్రాయం అయ్యో అయ్యో కథలు మాత్రమే.

1960 ప్రాంతాలలో మద్రాసు ప్రొహిబిషన్ ఆక్టు ప్రకారం ఆంధ్ర దేశంలో మద్యపాన నిషేధ చట్టం అమలు లోకి వచ్చింది. ప్రభుత్వపరంగా నిషేధించబడిన సారా దొంగసారా రూపంలో విచ్చలవిడిగా స్వైరవిహారం చేసింది. మోటారు సైకిల్, రిక్షా చక్రాల ట్యూబుల దగ్గర నుంచి ఆడవారి చీరల మాటున సారా ఏరులా ప్రవహించింది. ఈ దొంగసారా రవాణాకి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పడింది. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు అన్న తేడా లేకుండా సారా రవాణాలో ఎందరో సహకరించారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం లోని అవినీతి మద్యపాన నిషేధ చట్టం విఫలం కావడానికి ప్రధాన కారణం అయింది.

అప్పుడప్పుడే స్వతంత్రంగా ప్రాక్టీసు ప్రారంభించి న్యాయవాదిగా జీవితం ప్రారంభించిన రావిశాస్త్రికి జీవితంలోని మరో పార్శ్వాన్ని కొత్త కోణంలో చూడడానికి అవకాశం కలిగింది. సారా రవాణా కోసం ఏర్పడిన కొత్త వ్యవస్థలో అట్టడుగు వర్గానికి చెందిన పేదలు అతి ముఖ్యమైన పాత్ర వహించారు. పోలీసుల ఆచూకిని పసిగట్టి హెచ్చరించగలిగే ఇన్ ఫార్మర్లుగా, పట్టుబడితే యజమానికి బదులుగా శిక్ష అనుభవించడానికి సిద్ధపడే వారిగా ఉంటూ వ్యాపారానికి సహకరించారు. పట్టుబడితే జరిమానా తాము కడతామని చెప్పి ఆ తర్వాత మోసం చేసిన కాంట్రాక్టర్ల వల్ల జరిమానా కట్టలేక శిక్షలు పడిన వారు, పోలీసులకు మామూళ్ళు ఇవ్వక పోవడం వల్ల అక్రమంగా కేసులు బనాయించబడిన వాళ్ళు – ఇలా ఎందరో పేద క్లయింట్లు రావిశాస్త్రిగారి సహాయం కోసం వచ్చేవాళ్లు.

రచయితగా తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుంటున్న రావిశాస్త్రికి తానెవరివైపు నిలబడాలో, తన రచనల వలన ఆశించే ప్రయోజనం ఏమిటో తేల్చుకోవలసిన అవసరం వచ్చింది. సంఘంలో జరుగుతున్న అన్యాయాలకు బలవుతున్నది అలగా జనమేనని, డబ్బు, పదవి, పలుకుబడి ఉన్నవారు నిజంగా తప్పు చేసినా తప్పించు కోగలుగుతున్నారని తెలుసుకున్నారు.

రచయితగా తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుంటున్న రావిశాస్త్రికి తానెవరివైపు నిలబడాలో, తన రచనల వలన ఆశించే ప్రయోజనం ఏమిటో తేల్చుకోవలసిన అవసరం వచ్చింది. సంఘంలో జరుగుతున్న అన్యాయాలకు బలవుతున్నది అలగా జనమేనని, డబ్బు, పదవి, పలుకుబడి ఉన్నవారు నిజంగా తప్పు చేసినా తప్పించు కోగలుగుతున్నారని తెలుసుకున్నారు.

ఏ పాపం ఎరగనివాళ్లు జెయిళ్ళలోను, బయటా కూడా మగ్గుతూనే ఉన్నారు. పాపంలా పెరిగిన పెద్దవారు ఎన్ని పాపాలు చేసినా వారే పెద్దవారిగా ప్రభువులుగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సంఘంలో పేదవాడికి న్యాయం దొరకదు గాక దొరకదు. తనకన్యాయం జరిగితే ఎదుర్కొందికి పేదవాడికి అవకాశం లేదు కాక లేదు. ఈ పరిస్థితి మారాలని నాకుంది – అని తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న రావిశాస్త్రి రచనలలో చాలా మార్పు వచ్చింది.

గ్రామీణ, పట్టణ ప్రాంతపు ప్రజల జీవన విధానాలు, మానవ మనస్తత్వాలు ప్రధానంగా చిత్రిస్తూ వచ్చిన తెలుగు కథా ప్రపంచానికి పట్టణ జీవితపు అధోః జగత్తుని విభిన్న కోణాలలో చిత్రిస్తూ సాగిన సారా కథలు ఒక కొత్తలోకాన్ని పరిచయం చేసాయి. మనతోనే ఉంటూ మనం రోజూ చూస్తున్నవారి జీవితాలలో ఎంత విషాదం ఉందో, పేదరికం వారి మధ్య పరస్పర సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూపించాయి. సంఘంలో నాగరిక జీవనం కోసం ఏర్పరచుకున్న నీతి సూత్రాలన్నీ పేదరికం ముందు బలాదూర్ అయిపోతాయి. రక్షించవలసిన పోలీసు వ్యవస్థ అవినీతి రుచి మరిగి భక్షించడం మొదలు పెడితే వారి అక్రమార్జన కోసం మొదట బలయ్యేది పేదలే, అసహాయులే అని రావిశాస్త్రి కథలు నిరూపించాయి.

రావిశాస్త్రి మధ్య తరగతి విషాదాన్ని ఆవిష్కరిస్తూ సాగిన అయ్యో అయ్యో కథలు సారో కథలైతే, అధో జగత్తుకు చెందిన వారి బ్రతుకు పుస్తకాలను తెరిచి చూపించినవి సారా కథలు.

ఏకకాలంలో అనేక రసాలను ఉప్పొంగింపచేసే కళాఖండాలని, అటువంటి రసానుభూతినే తాను రసన అంటానని, రావిశాస్త్రి రచనలు రసనను సమృద్ధిగా ఆవిష్కరించగలుగుతున్నాయని మహాకవి శ్రీశ్రీ ప్రశంసలు అందుకున్నాయి రావిశాస్త్రి రచనలు.

తనని ఉర్రూతలూగించిన శ్రీశ్రీ మీద గౌరవంతో శ్రీశ్రీ కావేవీ కవితకనర్హం అంటూ చెప్పిన కవితా వస్తువులను కథా వస్తువులుగా స్వీకరించి కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, రొట్టెముక్క, బల్లచెక్క, అరటితొక్క, తలుపుగొళ్లెం, హారతి పళ్లెం, గుర్రపు కళ్ళెం పేరుతో కథలు వ్రాసారు. చివరి గుర్రపు కళ్ళెం మాత్రం కథ పరిధులను మించిపోయి నవలగా రూపాంతరం చెంది మరిడీ మహాలక్ష్మమ్మ కథ, లేదా గోవులొస్తున్నాయి జాగ్రత్త పేరుతో కనిపిస్తుంది.

స్వాతంత్ర్యం వచ్చినా దాని ఫలాలను అందుకోలేకపోయిన ప్రజల జీవితాలలోని దుర్భరత 1970 లో నక్సల్బరీ ఆందోళనగా వెల్లడయింది. రచయితలారా మీరెటువైపు అంటూ విద్యార్థి లోకం తమ కరపత్రం ద్వారా రచయితలను, కవులను నిలదీసింది. విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. రావిశాస్త్రి ఉపాద్యక్షుడిగా ఉన్నారు. జీవితాన్ని కేవలం చిత్రించడమే కాకుండా పోలీసులు తుపాకులు పేల్చినప్పుడు నిబ్బరంగా నిలబడే గుండె ధైర్యాన్ని జనానికి తమ రచనల ద్వారా విప్లవ రచయితలు కలిగించాలి. విరసం లక్ష్యం, ధ్యేయం అవే అని, భయం అనే ఈ అడ్డుగోడను భేదిస్తే విప్లవం వస్తుంది, ప్రజలకు జ్ఞానోదయం కలిగించి భయాన్ని నిర్మూలించడమే రచయితల కర్తవ్యం అని త్రికరణ శుద్ధిగా నమ్మి రావిశాస్త్రి ఆ ఆశయ సాధన కోసమే రచనలు చేసారు.

వేతనశర్మ, షోకుపిల్లి, పిపీలికం మొదలైన కథలన్నీ విరసం నేపథ్యంలో వ్రాసినవే. బాకీ కథలు పేరుతో ఈ కథలన్నీ సంపుటిగా వచ్చాయి.

ఏనాడో బ్రిటిష్ ప్రభుత్వంవారి హయాంలో ఏర్పరుచుకున్న కోర్టు విధానాలు, జైళ్ళ పరిపాలన వ్యవహారాలు స్వతంత్రం వచ్చాక కూడా మార్చుకోకుండా కొనసాగించడం జరిగింది. జైలుశిక్ష పడినప్పుడు, విడుదల కావడానికి అనుసరించవలసిన విధి విధానాలు, స్టాంపులు అంటించడం లాంటి చిన్న విషయాలు తెలియకపోయినందుకు నిరక్షరాస్యులైన పేదలు జైళ్ళలో మగ్గి పోవడమే కాక తమ ఆస్తులు సహితం ఎలా కోల్పోవలసి వస్తుందో వివరించిన నవల సొమ్ములు పోనాయండి.

రెండుసార్లు తన రచనా కళకు దక్కిన ప్రభుత్వ గౌరవాలను, కళా ప్రపూర్ణ బిరుదునూ తిరస్కరించారు రావిశాస్త్రి తాను నమ్మిన సిద్ధాంతాలకు గౌరవం ఇస్తూ.

1975 లో ఎమర్జెన్సీ లో అరెస్టు కాబడి తీవ్ర అనారోగ్య పరిస్థితుల వలన విరసానికి రాజీనామా చేసి, ప్రభుత్వం విధించిన షరతులకు లొంగి పోయారు. కానీ 1980 లో దశాబ్ది ఉత్సవాలకు హాజరై విరసం కార్యకలాపాలలో క్రియాశీలక పాత్ర వహించారు రావిశాస్త్రి. జైలు జీవితంలో ప్రారంభించిన నవల రత్తాలు రాంబాబు. రాజు మహిషి, మూడు కథల బంగారం నవలలు వ్రాసిన రావిశాస్త్రి దశాబ్దకాలం పాటు స్తబ్దుగా ఉండి 1993 లో కొందరికి ఉండవలసిన గూడు అయిన ఇల్లు మరికొందరికి పొందవలసిన ఆస్తిగా ఎలా మారుతోందో చెప్పే కథావస్తువుగా తీసుకొని ఇల్లు నవల వ్రాసేరు. ఏడోచంద్రుడు పేరుతో నవల ప్రారంభం చేసినా పది పేజీలు కూడా వ్రాయకుండా అనారోగ్యం ఉక్కిరి బిక్కిరి చేసింది. శలవంటూ ఈ లోకాన్ని, సాహితీ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు రావిశాస్త్రి.

నవంబరు పది
రాచకొండ వారి విశ్వం
అబ్బూరి వరద గారి శాస్త్రి
సాహితీ లోకం వారి రావిశాస్త్రి
సర్వులకూ రాచకొండ విశ్వనాథ శాస్త్రి

ఏడో చంద్రుడు ఉదయించక ముందే అస్తమించాడు. ఏడోచంద్రుడు పూర్తయి ఉంటే సాహిత్యానికి ఎంత అద్భుతమైన కానుక అయిఉండేదో.

(కాళీ పట్నం రామారావు)

ఇక కథ లేదు
వ్యథ
దారిలేదు, ఎడారి ఎడారి
అడుగడునా ఇక అశ్రుఘాతాలే
శిరస్సు వ్రయ్యలైన అప శబ్ద శరీరాలే
వీధి మొగలో ధూళి, ధూళి
జీవన గ్రంథం నిండా పొగ, పొగ

(అజంతా)

అని రచయితలు రావిశాస్త్రికి అంజలి ఘటించారు.

—————————

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు – హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు – ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు.

సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు.

Posted in వ్యాసం | Tagged | 5 Comments

కొంగేదీ?

-మూలా సుబ్రహ్మణ్యం

శీతాకాలపు సాయంత్రం
ఆలయ ప్రాంగణంలోని
పచ్చగడ్డిలో కూచున్నాం

అల్లంత దూరంలో వాలిన
తెల్ల కొంగని చూడగానే
ఒక్కసారిగా పాప మనసు
రెక్కలు తొడుక్కుంది

పట్టరాని సంతోషంతో
పరవళ్ళు తొక్కుతుంటే
పచ్చగడ్డిలో పసిపాదాల
ముచ్చటైన సవ్వడి

చెంగున దూకుతున్న పాపని చూసి
కొంగ చటుక్కున ఎగిరిపోగానే
నింగిలో విహరిస్తున్న పాప మనసు
తిరిగి నేలమీద వాలిపోయింది!

————–

Posted in కవిత్వం | 8 Comments

మృతజీవులు – 19

– కొడవటిగంటి కుటుంబరావు

ఈ మాటకు చిచీకవ్ మండిపడ్డాడు. తనను గురించి ఎవరు ఏపాటి అలుసుగా గాని, మొరటుగాగాని మాట్లాడినా అతను సహించలేడు. అవతలివాడు ఘరానామనిషి అయితేతప్ప, తనతో స్వతంత్రంగా మాట్లాడటం కూడా అతనికి ఇష్టం లేదు. అందుచేత ఇప్పుడతనికి చాలా కోపం వచ్చింది.

“సరే పోనీ, ఏమైనా కుక్కలను కొనుక్కో. రెంటిని అమ్ముతాను. -వాటిని చూస్తే నీ రోమాలు నిక్కబొడుచుకోవలిసిందే నన్నమాట! మంచి మీసాలు; వాటి వంటి మీది బొచ్చు బ్రష్ అనుకోవాలిసిందే; వాటి పక్కటెముకలు పీపాలాగ వర్ణనాతీతం; వాటి పాదాలు మెత్తగా, పొంకంగా ఉంటాయి – అవి నడిస్తే నేలమీద గుర్తులు కూడా పడవు.”

“ప్రమాణపూర్తిగా నిన్ను ఉరితీసి ఉందును. నిన్ను అవమానించడానికని ఇంత కుండపగలేసి చెప్పడం లేదు, స్నేహితుడుగా మాత్రమే చెబుతున్నాను.” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

చిచీకవ్ గంభీరంగా “దేనికైనా హద్దుండాలి. నీ చమత్కారం ఈ విధంగా చూపదలిస్తే బారకాసుల్లో చూపడం మంచిది. వాళ్ళను ఊరికే ఇవ్వడం ఇష్టం లేకపోతే అమ్మవచ్చు” అన్నాడు.

“అమ్మటమా! నేను నీ సంగతి ఎరుగుదునే, నువ్వు లుచ్ఛావి. నువు నాకు ఎక్కువ ఇయ్యవు, నాకు తెలుసు”

“ఛీ, భలేవాడివే మొత్తానికి! వాళ్ళు నీకెందుకు పనికొస్తారు చెప్పు, వాళ్ళేమన్నా రత్నాలా ఏమన్నానా?”

“అదుగో చూశావా? ఆ మాట అంటావని నాకు ముందే తెలుసు!”

“ఇదేమిటోయ్ నీలో ఇంత పిసినిగొట్టుతనం ఉందా! నిజంబడితే నాకు వాళ్ళని ఊరికే ఇచ్చెయ్యాలి.”

“సరే అయితే విను. నేను పిసినిగొట్టును కానని రుజువు చెయ్యటానికిగాను వాళ్ళను యివ్వటానికి డబ్బుతీసుకోను. నా మగ గుర్రాన్ని కొనుక్కో, వాళ్ళను కొసరు కింద ఇచ్చేస్తాను.”

“చాలా బాగుంది, ఆ మగ గుర్రాన్ని ఏం చేసుకొనేది?” అన్నాడు చిచీకవ్, ఈ బేరం చూసి నివ్వెరపోతూ.

“ఏం చేసికుంటావా? దాన్ని నేను పదివేలిచ్చి కొన్నానని నీకు తెలుసుగా, దాన్ని నాలుగువేలకు అమ్ముతాను.”

“కాని దాన్ని ఏం చేసుకునేది? నేను గుర్రాలను ఉత్పత్తి చేసేవాణ్ణి కాదే!”

“కొంచెం ఆగు, నువు సరిగా గ్రహించటం లేదు; మూడువేలు రొక్కం ఇచ్చి మిగతాది తరవాత ఇయ్యి”

“కాని నాకు నీ గుర్రం అక్కర్లేదు, దాని కడుపు చల్లగుండ!”

“సరే గోధుమ రంగు ఆడగుర్రం తీసుకో.”

“నాకు ఆడగుర్రమూ వద్దు”

“దాన్నీ, బూడిదరంగు గుర్రాన్ని కలిపి రెండువేల కిస్తాను”

“నాకు గుర్రాలు అక్కర్లేదు”

“వాటిని అమ్ముకో. సంతలో పెట్టావంటే మూడింతలు ధర వస్తుంది”

“మూడింతలు వచ్చే పక్షంలో వాటిని నువే అమ్ముకోరాదూ?”

“నాకు లాభం వస్తుందని తెలుసు. నువు లాభం పొందాలని నా ఉద్దేశ్యం”

చిచీకవ్ అతనికి ధన్యవాదాలు తెలిపి, తనకు గోధుమ రంగు గుర్రంగాని, బూడిదరంగు గుర్రంగాని అవసరం లేదని ఖచ్చితంగా చెప్పేశాడు.

“సరే పోనీ, ఏమైనా కుక్కలను కొనుక్కో. రెంటిని అమ్ముతాను. -వాటిని చూస్తే నీ రోమాలు నిక్కబొడుచుకోవలిసిందే నన్నమాట! మంచి మీసాలు; వాటి వంటి మీది బొచ్చు బ్రష్ అనుకోవాలిసిందే; వాటి పక్కటెముకలు పీపాలాగ వర్ణనాతీతం; వాటి పాదాలు మెత్తగా, పొంకంగా ఉంటాయి – అవి నడిస్తే నేలమీద గుర్తులు కూడా పడవు.”

“కాని నాకు కుక్కలు దేనికి? నేను వేటగాణ్ణి కాను”

“నీ దగ్గర కుక్కలుంటే నాకు చాలా బాగుంటుంది. పోనీ నీకు కుక్కలు వద్దకపోతే, నా బేరన్ ఆర్గన్ కొనుక్కో. అది అద్భుతమైన ఆర్గన్. సత్యప్రమాణంగా చెబుతున్నాను, పదిహేను వందల రూబుళ్ళు పోసి కొన్నాను. తొమ్మిది వందలిచ్చేసి తీసుకో.”

“ఈ సంగీతపు తిత్తిని నేనేం చేసుకోను. జర్మను లాగా వీధులంట తిరుగుతూ అడుక్కునేదా?”

“ఇది జర్మనులు పట్టుకు తిరిగే బేరన్ ఆర్గను అనుకున్నావు కాబోలు. ఇది ఆర్గన్. దాన్ని సరిగ్గా చూడు. భేషయిన చెక్క. మరోసారి చూపిస్తాను రా!” అంటూ నజ్‌ద్ర్యోవ్ చిచీకవ్ జబ్బ పట్టుకుని పక్కగదిలోకి వెళ్ళాడు. బేరన్ ఆర్గన్‌ను తాను ఎరుగుదునంటున్నప్పటికీ అతనికి వెళ్ళక తప్పలేదు. ఆ పాట మళ్ళీ వినకా తప్పలేదు.

“దీన్ని కొనటం నీకిష్టం లేకపోతే, నీ బండి యిచ్చి, మూడు వందల రూబుళ్ళియ్యి, బేరన్ ఆర్గనుతోపాటు చచ్చినవాళ్ళందరినీ తీసుకుపో”

“ఇంకా నయం! తరవాత నాకు బండి ఎలా?”

“నీకింకో బండి ఇస్తాలే. బండి ఉండేచోటికి రా, చూపిస్తాను. కాస్త రంగు వేయించావంటే భలే బండి”

“ఛీ వీడికి సైతాను పూనింది!” అనుకున్నాడు చిచీకవ్. ఏమయినా సరే తనకు బళ్ళూ, బేరన్ ఆర్గన్లూ, కుక్కలూ, పీపాల్లాంటి పక్కటెముకలున్నా సరే, మెత్తని పొంకమైన కాళ్ళున్నవయినా సరే, అక్కర్లేదనడానికి తీర్మానించుకున్నాడు.

“నీకు బండీ, బేరన్ ఆర్గనూ, చచ్చినవాళ్ళూ, అన్నీ ఇచ్చేస్తున్నాను చూసుకో” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“నాకు అక్కర్లేదు” అన్నాడు చిచీకవ్ మళ్ళీ.

“ఎందుకు అక్కర్లేదూ?”

“అక్కర్లేదు గనకనే, అంతకంటే ఏమీ లేదు”

“భలేవాడివే మొత్తానికి! స్నేహపూర్వకంగా నీతో వ్యాపారం చెయ్యటానికి లేదన్నమాట… నువు నిజంగా… వట్టి దగాకోరువని నిన్ను చూసే తెలుసుకోవచ్చు!”

“నీ మొహం నాకెన్నడూ కనిపించకుండా ఉన్నట్టయితే బాగుండిపోయేది” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

వ్యవహారం ఇలా విక్జటించినప్పటికీ వారిద్దరూ రాత్రి భోజనం కలిసే చేశారు. అయితే ఈసారి తాగటానికి రకరకాల సారాలు లేవు. ఉన్న పైప్రస్ సారా ఒకటీ ఎంత పుల్లగా ఉండాలో అంత పుల్లగా ఉంది. భోజనం అయినాక నజ్‌ద్ర్యోవ్ చిచీకవ్‌ను ఒక పడకగదిలోకి తీసుకుపోయి, “ఇదిగో నీ పక్క, గుడ్‌నైట్ చెప్పను” అన్నాడు.

“నేను వెర్రిబాగుల వాణ్ణనుకుంటున్నావా ఏమిటి? నువ్వే ఆలోచించు, నాకు బొత్తిగా పనికిరానివాటిని నేనెందుకు కొనాలి?”

“నువ్వేమీ చెప్పనక్కర్లేదు. నీ సంగతంతా నాకు తెలుసు. నువు పరమనీచుడివి. నేనొకటి చెబుతాను చూడు. కావలిస్తే పేకముక్క పందెం వేసుకుందాం, ఒక్కముక్క మీద చచ్చిన కమతగాళ్లందరినీ పందెం కాస్తాను, బేరన్ ఆర్గన్ను కూడానూ.”

“పేకముక్క మీద పందెం కాయటమంటే సందిగ్ధంలో పెట్టటమేగా?” అన్నాడు చిచీకవు, నజ్‌ద్ర్యోవ్ చేతిలో ఉన్న పేకకేసి క్రీగంట చూస్తూ, పేకముక్కలకు ఏదో జరిగినట్టూ, వాటిమీద ఉండే చుక్కలు కూడా అనుమానాస్పదంగానే ఉన్నట్టూ అతనికి తోచింది.

“సందిగ్ధం దేనికీ? అటువంటిదేమీ లేదు. అదృష్టం నీ పక్షాన ఉంటే ఒడుచుకుంటావు. అంతే! ఎంత అదృష్టం! ఎంత అదృష్టం! అంతా నీదే!” అంటూ అతను ప్రోత్సహించ యత్నించాడు. “ఆ దిక్కుమాలిన తొమ్మిది ఉన్నదంతా పోగొట్టుకున్నాను! అది నన్ను ముంచేస్తుందని అప్పుడే అనుకున్నాను. కళ్ళు సగం మూసుకొని, నీ తాడుతెగ, నువు నన్ను ముంచేస్తావు. నన్ను ముజంచేస్తావేమో అనుకున్నాను.”

నజ్‌ద్ర్యోవ్ ఈవిధంగా మాట్లాడుతుండగా పర్ఫీరి ఒక సీసా తీసుకువచ్చాడు. అయితే చిచీకవు తాగటానికీ, పేకాడటానికీ కూడా బొత్తిగా నిరాకరించాడు.

“ఎందుకాడవూ?” అన్నాడు నజ్‌ద్ర్యోవు.

“నాకిష్టం లేదుగనకా! అసలు నాకు చీట్లాటంటే యెప్పుడూ అంత ఇష్టం లేదు.”

“ఎందుకు లేదూ?”

“లేదు గనకనే” అన్నాడు చిచీకవ్ భుజాలు నిర్లక్ష్యంగా ఎగరేసి.

“నువు చాలా అల్పుడివి”

“ఏం చెయ్యాలి? దేవుడు నన్నలా పుట్టించాడు.”

“నువు వట్టి వాజవు! మొదట్లో నిన్ను చూసి ఏమో పెద్దమనిషి వనుకున్నాను, కాని నీకు ప్రవర్తించటం ఏమీ తెలీదు. నీతో స్నేహంగా మాట్లాడటానికి వీల్లేదు… నీలో చిత్తశుద్ధి లేదు. నువు పచ్చి సబాకవిచ్‌వి, దుర్మార్గుడివి!”

“ఎందుకు నన్నలా తిడుతున్నావు? పేకాడకపోతే అది నా తప్పా? నీకు అల్ప విషయాలు కూడా గొంతు పట్టుకుంటాయి గనక ఆ చచ్చిపోయిన వాళ్ళను మటుకు నాకు అమ్ము”

“అమ్ముతాను, కనిపెట్టుకునుండు! ఇంకా నేను వాళ్ళను నీకు ఊరికే ఇచ్చేద్దామనుకున్నాను, కాని ఇప్పుడసలివ్వను! పెన్నిధులిచ్చినా ఇవ్వను. నువు జేబులు కొట్టేవాడివి, దొంగవు. ఇకనుంచీ నీకూ నాకూ సంబంధం లేదు. పర్ఫీరి, నువు పోయి మన గుర్రాలవాడితో ఇతని గుర్రాలకు గింజలు పెట్టవద్దని చెప్పు., వట్టి ఎండుగడ్డి వెయ్యమను.”

ఇలాటి పరిణామం జరుగుతుందని చిచీకవ్ కొంచెం కూడా అనుకోలేదు.

“నీ మొహం నాకెన్నడూ కనిపించకుండా ఉన్నట్టయితే బాగుండిపోయేది” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

వ్యవహారం ఇలా విక్జటించినప్పటికీ వారిద్దరూ రాత్రి భోజనం కలిసే చేశారు. అయితే ఈసారి తాగటానికి రకరకాల సారాలు లేవు. ఉన్న పైప్రస్ సారా ఒకటీ ఎంత పుల్లగా ఉండాలో అంత పుల్లగా ఉంది. భోజనం అయినాక నజ్‌ద్ర్యోవ్ చిచీకవ్‌ను ఒక పడకగదిలోకి తీసుకుపోయి, “ఇదిగో నీ పక్క, గుడ్‌నైట్ చెప్పను” అన్నాడు.

నజ్‌ద్ర్యోవ్ వెళ్ళిపోయాక చిచీకవ్ మనస్థితి చాలా కలత చెందింది. ఇక్కడికి వచ్చి కాలం వృథా చేసుకున్నందుకు తనను తాను తిట్టుకుని తనలో తాను చాలా అసంతృప్తి చెందాడు; కాని నజ్‌ద్ర్యోవ్‌తో తన పని చెప్పేసినందుకు తనను తాను మరింత తిట్టుకున్నాడు. తన వ్యవహారం లాంటిది చప్పున నజ్‌ద్ర్యోవ్‌కు తెలియనివ్వటం అమాయకత్వం, పిల్లలు చేసేపని… నజ్‌ద్ర్యోవ్ వట్టి పనికిమాలిన వెధవ, వాడు అబద్ధాలు సృష్టించగలడు. అతిశయోక్తులు చెప్పగలడు, ఎటువంటి కట్టుకథలైనా ప్రచారం చెయ్యగలడు. వాటి మూలాన లేనిపోని అపవాదులు బయలుదేరవచ్చు… ఏనీ బాగాలేదు, ఏమీ బాగాలేదు. “నేను వట్టి మూర్ఖుణ్ణి” అనుకున్నాడతను.

అతనికి సరిగా నిద్రపట్టలేదు. ఏవో చిన్నచిన్న పురుగులు అతన్ని తెల్లవార్లూ కుట్టుతూనే ఉన్నాయి. “సైతాను మిమ్మల్ని పట్టా! నజ్‌ద్ర్యోవ్‌ను పట్టా!” అని వాటిని తిడుతూ తెల్లవార్లూ అతను ఒళ్ళంతా బరుక్కుంటూనే ఉన్నాడు. అతడు తెల్లవారుఝామునే లేచి దుస్తులు వేసుకుంటూనే గుర్రలశాలకు పోయి సేలిఫాన్‌తో వెంటనే బండినీ గుర్రాలనూ సిద్ధం చెయ్యమన్నాడు. అతను తిరిగి వస్తూండగా నజ్‌ద్ర్యోవ్‌కు కనిపించాడు. అతను డ్రెసింగ్‌గౌను వేసుకుని పైపు నోట్లో పెట్టుకుని వున్నాడు.

నజ్‌ద్ర్యోవ్ అతన్ని స్నేహపూర్వకంగా పలకరించి రాత్రి సుఖంగా నిద్ర పట్టిందా అని అడిగాడు.

“ఒక మాదిరిగా” అన్నాడు చిచీకవ్ ఉదాసీనంగా.

“ఏమోయ్, నాకు మటుకు తెల్లవార్లూ ఎలాంటి పీడకలలు వచ్చాయంటే చెప్పటానిక్కూడా అసహ్యంగా ఉంది. నా నోట్లో ఒక సైనికుల శిబిరం ఉన్నట్టనిపించింది. ఏమనుకున్నావో, నన్ను చావబాదినట్టు కల వచ్చింది. ఒట్టూ! నమ్ముతావో నమ్మవోకాని, నన్ను కొట్టింది ఎవరో తెలుసా? కాప్టెన్ వత్స్యేలుయేవ్ కువ్షిన్నికోవ్.”

“అవును, నిన్ను నిజంగా చావబాదితే బాగుండేది”? అనుకున్నాడు చిచీకవ్.

“ఒట్టు! చాలా బాధపెట్టింది కూడాను! నిద్రలేచేసరికి తాడుతెగ, నిజంగానే ఏవో కుడుతున్నాయి. గోమార్లో ఏమో అనుకుంటాను. సరే నువుపోయి దుస్తులు వేసుకో, నేనిప్పుడే వస్తున్నాను. దొంగముండాకొడుకు నా మేనేజరును కాస్త సతాయించాలి”

ఒళ్ళు కడుక్కుని డ్రెస్సు వేసుకొనేటందుకు చిచీకవ్ తనగదికి వెళ్ళాడు. ఆ తరవాత అతను భోజనాల గదిలోకి వెళ్ళేసరికి టీ ఫలహారాలు బల్లమీద అన్ని ఏర్పాట్లూ ఒక రమ్ సీసాతో సహా సిద్ధంగా ఉన్నాయి. కిందటి రోజు మధ్యాహ్నమూ రాత్రీ జరిగిన భోజనాల ఎంగిళ్ళ జాడలింకా ఉన్నాయి, గది వూడ్చినట్టు కూడా లేదు. బల్లపైన పరిచిన గుడ్డమీద కూడా రొట్టె తుంపులూ పొగాకు నుసీ వున్నాయి. మరి కాస్సేపటికి యింటి యజమాని వచ్చాడు. అతను పైన వేసుకున్న డ్రెసింగు గౌను అడుగున వేరే దుస్తులేమీ లేవు. బయటికి కనిపించే రొమ్ము మీద గడ్డ లాంటిది పెరిగివున్నది. చేతిలో పైపు పట్టుకుని, టీ తాగుతూ వుండగా అతన్ని చూస్తే.. ఏ చిత్రకారుడైనా – చక్కగా దుస్తులు వేసుకుని నున్నగా తలదువ్వుకున్న మనుష్యులను ఏవగించుకునే రకం చిత్రకారుడు – బొమ్మ గీసి ఉండును.

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 19

నిశ్శబ్దానికి మరోవైపు

-కొల్లూరి సోమశంకర్

భోగాపురం! విజయనగరం జిల్లాలో మేజర్ పంచాయతి. ఆ ఊర్లో దాదాపు ఇరవై వేలమంది జనాభా ఉంటారు. ఐదవ నంబరు జాతీయ రహదారిపైన, విజయనగరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ జిల్లా కేంద్ర గ్రంథాలయసంస్థ వారి శాఖా గ్రంథాలయం ఉంది. మన కథానాయకుడు మోహన్ ఇక్కడే లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాడు.

బదులుగా ఒక చోట కట్టలు కట్టి ఉన్న పుస్తకాలను చూపించాడు మోహన్.

“వాటిని బైండింగ్ చేయించాలి. యండమూరి నవలలు వాటిల్లో కొన్ని ఉన్నాయి. నీకు కావాల్సిన పుస్తకాన్ని తీసుకు వెళ్ళి చదివి, తర్వాత బైండింగ్ చేయించి ఇస్తానంటే, పట్టుకెళ్ళు”

“అదేంటి సార్, నేనెందుకు బైండింగ్ చేయించాలి?”

ఉదయం ఎనిమిది గంటలు దాటుతోంది. అయినా లైబ్రరీని ఇంకా తెరవలేదు. మోహన్ విజయనగరం నుంచి రావాలి. దినపత్రికల కోసం వచ్చే ముసలివాళ్ళు అసహనంగా ఉన్నారు. ఇంతలో హడావుడి పడుతూ మోహన్‌ రానే వచ్చాడు. గబగబా తాళాలు తీసి, కిటికీ లోంచి లోపలికి పడేసిన పేపర్లను సర్దుకుని, ప్రతీ పేపరుని దారంతో కట్టి వాటి మీద ముద్ర వేసి బల్లల పైన పెట్టాడు. క్రిందటి రోజు పేపర్లన్నింటిని బల్లలపై నుంచి తీసేసి ఒక్కోదాన్ని స్టాండులో వరుసగా పెట్టాడు. వచ్చిన పాఠకులందరూ కుర్చీలకు అతుక్కుని వార్తాపత్రికలు చదవడంలో నిమగ్నమైపోయారు. మోహన్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. సమయం తొమ్మిది కావస్తోంది. ‘టీ’ తేచ్చే కుర్రాడు ఇంకా రాలేదు. ఆ సమయానికి టీ తాగకపోతే ఏదోలా ఉంటుంది మోహన్‌కి.

ఇంతలో ఓ కుర్రాడు వచ్చి, “సార్, యండమూరి నవలలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగాడు.

“అక్కడ ‘తెలుగు నవలలు’ అనే అరలో చూడు బాబూ” అంటూ ఓ అరని చూపాడు మోహన్. ఆ అబ్బాయి కాసేపు వెదికి, తిరిగి మోహన్ దగ్గరికే వచ్చాడు.

“సార్, అవన్నీ బాగా పాతవి. ఈ మధ్య వచ్చిన పుస్తకాలు లేవా?”

బదులుగా ఒక చోట కట్టలు కట్టి ఉన్న పుస్తకాలను చూపించాడు మోహన్.

“వాటిని బైండింగ్ చేయించాలి. యండమూరి నవలలు వాటిల్లో కొన్ని ఉన్నాయి. నీకు కావాల్సిన పుస్తకాన్ని తీసుకు వెళ్ళి చదివి, తర్వాత బైండింగ్ చేయించి ఇస్తానంటే, పట్టుకెళ్ళు”

“అదేంటి సార్, నేనెందుకు బైండింగ్ చేయించాలి?”

ఏం చేయను? ఈ సారి బడ్జెట్‌లో బైండింగ్‌కి ప్రొవిజన్ ఇవ్వలేదు. సహృదయులైన పాఠకులనే భరించమంటున్నారు. మీరు మెచ్చిన, మీకు నచ్చిన పుస్తకాన్ని మీరు బైండింగ్ చేయిస్తే, మరికొంతమంది పాఠకులకు ఆ పుస్తకాన్ని చదివే వీలుంటుంది కదా…” వివరంగా చెప్పాడు మోహన్. ఆ అబ్బాయి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.

ఇంతలో టీ కుర్రాడు వచ్చి వేడి వేడిగా టీ ఇచ్చాడు. టీ తాగి తన పనిలో లీనమైపోయాడు మోహన్. ఆ రెండు గదుల్లోనూ నిశ్శబ్దం రాజ్యమేలసాగింది. సమయం పదకొండు గంటలు కావచ్చింది. ఆ పూటకి లైబ్రరీ కట్టేసే సమయం అయిందంటూ మోహన్ అలారం మ్రోగించాడు. పాఠకులందరూ చదువుతున్న పేపర్లు, పుస్తకాలు, నవలలు బల్లపైన పెట్టేసి ఒక్కొక్కరు బయటకి నడిచారు.

ఒక పెద్దాయన మాత్రం మోహన్ గదిలోకి వెళ్ళారు. ఆయన మోహన్‌కి దూరపు బంధువు. పేరు సీతారామయ్య. భోగాపురంలోనే హెడ్‌మాస్టారుగా పనిచేసి రిటైరయ్యారు.

“ఏం మోహనా, ఇక్కడ ఒక్కడివి కూర్చుని ఏం చేస్తావు? మా ఇంటికి వచ్చేయ్. కాసేపు చెస్ ఆడుకుందాం. సాయంత్రం నాలుగు గంటలకి లైబ్రరీకి రావచ్చు”

“వీలు కాదు బాబాయ్. చాలా పనులు ఉన్నాయి”

“అదేం, అందరూ వెళ్ళిపోయాక నీకింకేం పనులుంటాయి?”

“అసలు పనులు అప్పుడే మొదలవుతాయి బాబాయ్. స్టాక్ రిజిస్టర్‌ని, యాక్సెషన్ రిజిస్టర్‌ని, కాష్‌బుక్‌ని అప్ డేట్ చేసుకోవాలి. క్లాసిఫికేషన్, కాటలాగింగ్ చేయాలి. చదివేసి వదిలేసిన పేపర్లని, పుస్తకాలను వాటి స్థానంలో ఉంచాలి….. ఇలాంటి పనులెన్నో ఉంటాయి. నాకు రావడం కుదరదు బాబాయ్”

“సరే నీ ఇష్టం” అనేసి ఆయన వెళ్ళిపోయారు.

ఆ లైబ్రరీకి మోహన్ ఒక్కడే ఉద్యోగి కావడంతో, అతడికి చాలా కష్టంగా ఉంటోంది. చిన్నదైనా పెద్దదైనా ప్రతీ పనీ అతడే చేసుకోవాల్సివస్తోంది. ఒక సహాయకుడిని నియమించమంటే, నిధులు లేవంటూ ఏడాది నుంచి తిరస్కరిస్తున్నారు పై అధికారులు. చేసేదేమీ లేక, ఒక నెల క్రితం, ఆ ఊర్లోనే పదో తరగతి దాక చదువుకుని, చదువాపేసిన ఓ కుర్రాడిని సొంత పూచికత్తు పైన, తనకు అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు మోహన్. ఆ కుర్రాడు శ్రద్ధగా పనిచేస్తుండడంతో, దినపత్రికల గది తాళం అతనికే ఇచ్చి, లైబ్రరీని పొద్దున్నే ఆ కుర్రాడినే తెరవమనేవాడు. మోహన్ మాత్రం తొమ్మిదింటికి వచ్చి, నవలల సెక్షన్ తెరుస్తున్నాడు. గత మూడు రోజులగా ఆ కుర్రాడు ఊరు వెళ్ళడంతో, మోహన్‌కి పనిభారం ఎక్కువైంది.

దానికి తోడు నిన్న జిల్లా గ్రంథాలయంలో వేలంపాట జరిగింది. ఏడాదికి ఒకసారి పాత దిన, వార, మాస పత్రికలన్నింటినీ కలిపి వేలం వేస్తారు. ఎవరు ఎక్కువ పాడితే, వారికి జిల్లాలోని అన్ని గ్రంథాలయాల నుంచి పాత పుస్తకాలు, పేపర్లని ఇచ్చేస్తారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏ శాఖా గ్రంథాలయంలో ఏ పుస్తకం ఉంటుంది, ఏయే దినపత్రికలు ఉంటాయి, వాటి బరువు తదితర వివరాలు ఉంటాయి. ఆ వివరాలన్నీ వేలం పాటలో గెలిచినవారికి అందజేసి, ‘ఫలానా గ్రంథాలయం నుంచి, మీకు ఇన్ని కిలోల పాత పత్రికలు వస్తాయి. మీరు ఇంత మొత్తం ఇవ్వాలి’ అనే ఒప్పందం కుదుర్చుకుంటారు. ఏదైనా శాఖా గ్రంథాలయంలో చెప్పినదానికంటే తక్కువ మొత్తం వసూలైతే, మిగతా మొత్తాన్ని ఆ లైబ్రేరియన్ భరించాల్సిందే. ముందే నిర్ణీతమైన మొత్తాన్ని ట్రెజరీలో జమ చేయాల్సిందే.

చాలా శాఖా గ్రంథాలయాల భవనాలు సరిగా ఉండవు. వర్షాలకు, చెదలకు, పుస్తకాలు పాడైపోతుంటాయి. కొంత మంది చదువరులు తమకు కావాల్సిన ప్రకటనల కోసం కొన్ని పేజీలు ఎత్తుకుపోతారు. మరికొంత మంది కథలను కత్తిరించి తీసుకుపోతారు. మరికొంత మంది సినిమా స్టార్ల బొమ్మలు కత్తిరించేస్తారు. దాంతో లైబ్రేరియన్లు తమ జేబులు ఖాళీ చేసుకోక తప్పదు. మోహన్‌కి కొంచెం ఆందోళనగా ఉంది. ఎందుకంటే గత రెండేళ్ళుగా అతను తన డబ్బును కడుతునే ఉన్నాడు. ‘ఈ ఏడాది ఏమవుతుందో? రేపు పోస్టు వస్తుంది’ అని అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు.

“సార్, ‘పట్నంలో చిలక’ నవల వచ్చిందా?” అని అడిగాడు.

“కల్పనా సాహిత్యం, ఉద్రేకం కలిగించేవి జిల్లా కేంద్ర గ్రంథాలయం కొనడం లేదు” చెప్పాడు మోహన్.

“ఓ సుప్రసిద్ధ వారపత్రికలో సీరియల్‌గా వచ్చి, ఎంతో మంది పాఠకులను ఉర్రూతలూగించిన నవల అది. అలాంటి పుస్తకాలు లేకపోతే ఎలాగ?”

“చూడు బాబు, 1993 నుంచి లైబ్రరీలలో నవలలు తెప్పించడం మానేసారు. కాంపిటీటివ్ పుస్తకాలు, ఇయర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, కథా సంకలనాలు వంటివే తెప్పిస్తున్నారు. వాటిల్లో నీకు కావాల్సినవి ఏవైనా ఉంటే తీసుకుని చదువుకో”

సాయంత్రం నాలుగయ్యింది. మళ్ళీ చదువరులు రావడం ప్రారంభించారు.

ఓ కుర్రాడు వచ్చి , మోహన్ ఎదురు కుర్చీలో కూర్చుని, “సార్, ‘పట్నంలో చిలక’ నవల వచ్చిందా?” అని అడిగాడు.

“కల్పనా సాహిత్యం, ఉద్రేకం కలిగించేవి జిల్లా కేంద్ర గ్రంథాలయం కొనడం లేదు” చెప్పాడు మోహన్.

“ఓ సుప్రసిద్ధ వారపత్రికలో సీరియల్‌గా వచ్చి, ఎంతో మంది పాఠకులను ఉర్రూతలూగించిన నవల అది. అలాంటి పుస్తకాలు లేకపోతే ఎలాగ?”

“చూడు బాబు, 1993 నుంచి లైబ్రరీలలో నవలలు తెప్పించడం మానేసారు. కాంపిటీటివ్ పుస్తకాలు, ఇయర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, కథా సంకలనాలు వంటివే తెప్పిస్తున్నారు. వాటిల్లో నీకు కావాల్సినవి ఏవైనా ఉంటే తీసుకుని చదువుకో”

“అదేంటండి, మేము ఇంటి పన్ను కడుతున్నాం, అందులో లైబ్రరీ సెస్ కూడ ఉంటుంది. మా డబ్బులు తీసుకుంటూ, మేము అడిగిన పుస్తకాలు లేవనడం ఏం మర్యాద?” అంటూ ఆ కుర్రాడు గదమాయించాడు.

ఆ అబ్బాయికి సర్ది చెప్పి పంపేసరికి, తల ప్రాణం తోకకొచ్చింది మోహన్‌కి. అప్పుడప్పుడు ఇలా దురుసుగా ప్రవర్తించే పాఠకులు తటస్థపడుతుంటారు. వాళ్ళతో సంయమనంగా వ్యవహరించక పోతే గ్రామ సర్పంచికి, జిల్లా కేంద్ర గ్రంథాలయాధికారికి ఫిర్యాదు చేస్తూంటారు.

ఆరు యాభై దాక ఓపికగా కూర్చున్న మోహన్ ని నిస్త్రాణ ఆవరించింది. టైం ఆవుతోందంటూ అలారం మోగించాడు. మెల్లగా ఒక్కొక్కరు వెళ్ళాక, పేపర్లని సర్దుకొని, గదులకు తాళాలేసి, బయటి తాళం వేసుకుని ఇంటి ముఖం పట్టాడు. కాస్త ఖాళీగా ఉన్న బస్సు పట్టుకుని ఇల్లు చేరేససరికి ఎనిమిది గంటలైంది.

మోహన్ భార్య శ్రావణి సంగీతం టీచరు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. కూతురు సరోజ ఐదో తరగతి, కొడుకు శ్రీరామ్ మూడో తరగతి చదువుతున్నారు. మోహన్ తల్లిదండ్రులు శ్రీకాకుళంలో, వాళ్ళ పెద్దబ్బాయి దగ్గర ఉంటారు. భర్త ఇంటికి చేరేసరికి కమ్మటి కాఫీ కలిపి సిధ్ధంగా ఉంచుతుంది శ్రావణి. కాఫీ తాగుతూ పిల్లల కబుర్లు వింటాడు మోహన్. నాన్నతో కబుర్లు చెప్పుకోవడం కోసం, పిల్లలు తమ హోంవర్కుని గబగబా పూర్తి చేసుకుని, చదవాల్సిన పాఠాలు చదివేసుకుని, భోంచేసి తయారుగా ఉంటారు. తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యలో స్నానానికి లేస్తాడు మోహన్. పిల్లలని నిద్రపుచ్చి, అన్నం వడ్డిస్తుంది శ్రావణి. ఇద్దరూ భోజనాలు చేసాక, కాసేపు అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజు కృతులు పాడుతుంది శ్రావణి. ఆ రోజు శ్రమని మరుస్తూ, నిద్రలోకి జారుకుంటారు ఇద్దరూ. ఆర్ధికంగా వెలితి ఉన్నా, కలత లేని సంసారం వాళ్ళది.

***

తెల్లారింది. ఆ రోజు గురువారం. తర్వాతి రెండు రోజులు శుక్రవారం, రెండో శనివారం కావడంతో లైబ్రరీ హడావుడిగా ఉంటుంది. “ఈ ఒక్కరోజు వెడితే, రెండు రోజులు సెలవు” అని అనుకుంటూ గబగబా తయారయ్యాడు మోహన్.

గ్రంథాలయానికి చేరేసరికి, ఇద్దరు ముగ్గురు ఆతడి కోసమే ఎదురుచూస్తున్నారు. తాళాలు తీసి గదుల కిటికీలు పూర్తిగా తెరచి, పేపర్లపై ముద్రలు వేసి బల్లలపై పెట్టాడు మోహన్.

కాసేపయ్యాక ఓ అమ్మాయి వచ్చి, “సార్ , మీతో కాస్త మాట్లాడాలి. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెబితే, అప్పుడు వచ్చి కలుస్తాను” అంది నమ్రతగా.

“నేనిప్పుడు ఫ్రీగానే ఉన్నాను. చెప్పండి, దేని గురించి మాట్లాడాలి?”

“నేను డి.ఎస్సీ పరీక్షలకి ప్రిపేరవుతున్నాను సార్! నాకు కొన్ని రిఫరెన్స్ బుక్స్ కావాలి. అవి విజయనగరం జిల్లా గ్రంథాలయంలో దొరుకుతాయి. ఈసారి మీరు విజయనగరం నుంచి వచ్చేటప్పుడు వాటిని మీ ఎకౌంటులో తీసుకుని నా కిస్తే, నాకు చాలా సహాయం చేసినవారవుతారు. నేను అంత ఖరీదు పెట్టి కొనలేను…..” చెప్పిందా అమ్మాయి.

“మీ పేరేమిటి? ఇల్లెక్కడ?”

“నా పేరు కావ్య. మాది సర్పంచ్ గారి ఎదురిల్లు”

“చూడమ్మా, ఈ మధ్య జిల్లా కేంద్ర గ్రంథాలయం వాళ్ళు పాఠకులకి ఓ ప్రతిపాదన చేసారు. మీకు కావలసిన పుస్తకాల పేర్లు రాసిస్తే, వాటిల్లో ఉత్తమమైన వాటిని కొని, అన్ని శాఖా గ్రంథాలయాలకి పంపుతారు. పోటీ పరీక్షలకి హజరయ్యే మీ లాంటివాళ్ళకి కావలసిన పుస్తకాలను నువ్వు రాసిస్తే, నేను మన గ్రంథాలయం తరపున విజయనగరం పంపిస్తాను”

“తప్పకుండా రాసిస్తాను సార్,” అంటూ సంతోషంగా వెళ్ళింది కావ్య. ఇలాంటి వాళ్ళని చూస్తే మోహన్‌కి ముచ్చటేస్తుంది. ఎదగాలనే తపన ఉన్న వారిని ప్రోత్సహించాలనే మనస్తత్వం మోహన్‌ది. ఓ ఐదు నిమిషాల తర్వాత కావ్య వచ్చి రెండు కాగితాలు ఇచ్చింది. ఒకటి గ్రంథాలయంలో ఉంచాల్సిన పుస్తకాల పట్టీ, రెండోది ఆమెకి కావాల్సిన పుస్తకాలు.

రెండవపేజీ>>

Posted in కథ | Tagged | 14 Comments

స్వేచ్ఛా విహంగాలు (Stray birds)

— విశ్వకవి రవీంద్రుని ‘Stray birds’కు స్వేచ్ఛానువాదం: రవి

భగవంతుడి శక్తి మలయమారుతానిది.
ఝంఝామారుతానిది కాదు.

విశ్వం బాధతో నా ఆత్మను చుంబించి,
సాంత్వన కోసం నా గానాన్ని కోరింది.

ఓ స్త్రీ! నీ నవ్వులో జీవితమనే జలధారలోని సంగీతం ఉంది.

జీవితపు ఆనందం గ్రీష్మంలో పూచే పూలలోనూ,
శిశిరం లో రాలే ఆకులలోనూ ప్రక్షిప్తం.

నీకు ఆకలి లేదని, భోజనాన్ని నిందించకు.

నువ్వు చిరునవ్వు నవ్వి శూన్యం గురించి మాట్లాడేవు.
అందుకోసమేనేమో నా నిరీక్షణ అని నాకనిపించింది.

తర్కపూరిత చిత్తం కత్తితో సమానం.
ఉపయోగించే చేతికది చేస్తుంది గాయం.

మనం ప్రపంచాన్ని వక్ర దృష్టి తో చూసి,
ప్రపంచం మనను మోసపుచ్చిందనుకుంటాం.

కడలి తరంగాలు, పక్షుల కలయికలా మనం దగ్గరౌతాం.
పక్షులు నింగికెగసి పోతాయి.
కడలి తరంగాలు వెనక్కు మళ్ళుతాయి.
మనమూ అలానే దూరమవుతాం.

——————
కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన రవి, ప్రస్తుతం ఉద్యోగరీత్యా బెంగళూరులో నివాసముంటున్నారు. 2007 సెప్టెంబరు నుండి బ్లాగాడిస్తూ ఉన్నారు.
గతంలో ఇతర వెబ్‌సైట్లలో సమీక్షలు పేరడీలూ రాసేవారు.

తెలుగు మీద మమకారంతో పాటు, వీరికి సంస్కృత భాషతో పరిచయమూ ఉంది.

Posted in కవిత్వం | Tagged , | 11 Comments

2008 జూలై గడిపై మీమాట

జూలై గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 జూన్ గడి, సమాధానాలు
2. 2008 మే గడి, సమాధానాలు
3. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
4. 2008 మార్చి గడి, సమాధానాలు
5. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
6. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
7. 2007 నవంబరు గడి, సమాధానాలు
8. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
9. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
10. 2007 జూలై గడి, సమాధానాలు
11. 2007 జూన్ గడి, సమాధానాలు
12. 2007 మే గడి, సమాధానాలు
13. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
14. 2007 మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 6 Comments

జూన్ గడి సమాధానాలు, వివరణలు

పరిష్కారాలు పంపినవారు

మొత్తం ఐదుమంది. తప్పుల్లేకుండా నింపినవారు ఎవరూలేరు.
సుజాత (మనసులో మాట) (ఒక తప్పుతో), భైరవభట్ల కామేశ్వరరావు (2 తప్పులతో), మరో మాట చెప్పు (2 తప్పులతో), bh.aditya369 (3 తప్పులతో), వికటకవి (11 తప్పులతో).

1

ర్ష

2

3ము

X

4వే

5

6

7ము

న్య

X

8

ము

నా

తీ

ము

X

X

X

న్ను

X

9అం

త్య

ము

X

రు

X

10ధా

ర్మి

11కు

డు

X

12

లా

X

13

X

ని

X

ని

X

14తా

X

15గి

16క

X

X

X

17నె

X

18కౌ

పీ

19పా

X

20కా

డి

21మా

ను

22లు

X

23న


X

X

ల్కు

X

కై

X

తం

X

24వ

25ద

రు

X

26పే

27ము

28రి

29మ్మ

X

30మూ

31ది

X

X

32రా

గు

లు

33కి

ణం

X

X

34వ

35గ

X

36ల


X

X


లే

X

X

X

37 ము

ని 38క

న్న

డి

39సే

ద్యం

X

X

40ఊ

41రో

42డు

X

43ము



X

44తు

45వృ

కో


రు

డు

X

46మ

నం

X

47కా

రా

X

Continue reading

Posted in గడి | Tagged | 6 Comments

రాసినది చదవడం

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ఇప్పటి తెలుగు ఉచ్చరించే పద్ధతిలో ఫోనెటిక్‌గా ఉంటుంది కనక మనకు అంత ఇబ్బందిగా ఉండదు. అయినా మామ, చీమ, దోమ వగైరా పదాలను కోస్తావారిలాగా తక్కిన తెలుగువారు మాఁవ, చీఁవ, దోఁవ అనకపోవడం చూస్తూనే ఉంటాం.

అక్షరాలకు ప్రాణం ఉండదు. అవి శబ్దాలకు కేవలం సూచకాలు మాత్రమే; ఉచ్చారణకు కొంతవరకే తోడ్పడతాయి కాని హావభావాలను పలికించలేవు. అందుకే ప్రతిభావంతులైన నటులు పసలేని నాటక సంభాషణకుకూడా ప్రాణం పోస్తూ ఉంటారు. నిత్యజీవితం మాటకొస్తే “దేవుని ఎదుట ప్రమాణంచేసి అంతా నిజమే చెప్తానూ? అబద్ధం చెప్పనూ?” అంటూ కోర్టులో స్వరం మార్చి సాక్ష్యం చెప్పే పాతకాలపు జోక్‌ ఒకటి వింటూ ఉంటాం. మొత్తం మీద రాయడం, చదవడం మధ్య తేడాలుండవచ్చు. లిఖిత సమాచారం మన మేధస్సుకు సహాయపడే ఊతకర్ర వంటిది. చిన్నప్పటినుంచీ నేర్చుకుంటాం కనక అక్షరాలను చదివి, మనసులోనో, బిగ్గరగానో ఉచ్చరిస్తూ పదాలను అర్థంచేసుకోవడం మనకు అలవా టవుతుంది. ఎందుకంటే ప్రపంచభాషల్లో వేటిలోనైనా అక్షరాల స్వరూపానికి స్వతహాగా అర్థమేమీ ఉండదు. ఎటువంటి వంకరగీతలు ఎటువంటి శబ్దాన్ని సూచిస్తాయో ముందుగా నిబంధించిన సూత్రాలనే అందరూ పాటిస్తారు. ఇదొక షార్ట్‌కట్‌ పద్ధతి. ఇది ఎన్ని రకాలుగానైనా ఉండవచ్చు. వివిధ ప్రాంతాల్లో, వివిధ యుగాల్లో అనేక పద్ధతులు మొదలై, వ్యాప్తిలోకి వచ్చాయి.

ఇంగ్లీష్‌ అక్షరాలలాగే కనిపిస్తున్నా వాటి ఉచ్చారణలో ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, స్పానిష్‌ మొదలైన భాషల్లో తేడాలుంటాయి. ఇవి సరిగ్గా తెలియకపోవడంవల్ల అంధుల లిపిని బ్రెయిల్‌ అనడానికి బదులుగా మనవాళ్ళు తెలుగులో బ్రెయిలీ అనీ, రాక్‌విల్‌ మొదలైన ఊళ్ళ పేర్లను రాక్‌విల్లీ అనీ రాస్తూ ఉంటారు. స్పానిష్‌ ఉచ్చారణ మరింత గొడవగా ఉంటుంది కనక శాన్‌హొసే అనే ఊరి పేరును చాలామంది శాన్‌జోస్‌ అని తప్పుగా పలుకుతారు. విదేశీ పదాలకూ, పేర్లకూ సరైన ఉచ్చారణను తెలిపే సదుపాయాలు ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చని ఈ కాలపు జర్నలిస్టులుకూడా గమనిస్తున్నట్టు కనబడదు. ఇంగ్లీషులోనే వోట్ అనేమాటను ఓటు అని రాయడం, పైలట్ అనేమాటను పైలెట్ అనడం, మైనారిటీ, మ్యునిసిపాలిటీ మొదలైన పదాలను మైనార్టీ, మున్సిపాల్టీ అని రాయడం వగైరా తప్పుడు సాంప్రదాయాలను వారే కొనసాగిస్తూ ఉంటారు.

మనలాగా కాకుండా చైనా భాష వంటివాటిలో ఒకే అక్షరం ఒక పూర్తి పదాన్ని సూచిస్తుందంటే మనకు కొత్తగా అనిపిస్తుంది కాని నిజానికి అంకెల విషయంలో మనకూ అటువంటి ఏర్పాటే ఉంది. 4 అని రాసినప్పటికీ మనం దాన్ని నాలుగు అనే మూడక్షరాల పదంగానే పరిగణిస్తాం. కొన్ని భాషల్లో ఒక్కొక్క సంకేతమూ ఒక్కొక్క ఉచ్చరించదగిన శబ్దంగా పనికొస్తుంది. ఈ సంకేతాలు ఒక్కొక్కటీ చిత్రలిపి కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది శ్లేష పద్ధతి. దీనికి ఉదాహరణగా ఆరుద్ర తన కవిత ఒకదానికి సరదాగా “6ద్ర 7పు” అనే శీర్షిక పెట్టారనేది చెప్పవచ్చు.

తెలుగులో ప్రాచీనకావ్యాల్లో అరసున్నా ఉండేదికాదు. ఎటొచ్చీ పూర్వకాలంలో తెలుగులో దాదాపు ఒకేలాంటి ఉచ్చారణ కలిగిన కొన్ని పదాలలో ఒకదాన్ని మామూలుగానూ, మరొకదాన్ని ముక్కుతో పలికేవారట. సందర్భాన్నిబట్టి ఏది ఎలా పలకాలో అందరికీ తెలిసేది. ఉదాహరణకు వాడు అంటే ఉపయోగించు, లేదా ఎండిపోవు అనే అర్థం ఉంది. మూడో అర్థంలో అతడు అని కూడా అనుకోవచ్చు. కానీ పండితులు మూడో సందర్భంలో మాత్రం వాఁడు అని రాయాలంటారు. ప్రాచీన కాలంలో లేని ఈ ప్రయోగం తరవాతి కాలంలో ఎందుకొచ్చిందో వివరిస్తూ తిరుమల రామచంద్రగారు కొన్ని విషయాలు రాశారు. పాత తెలుగులో వాండు అనే ప్రయోగం ఉండేది. ఇప్పటికీ రాయలసీమ మొదలైన ప్రాంతాల్లో బహువచనంలో వాండ్లు అనే అలవాటు కనబడుతుంది. ఈ వాండు అనే మాటను ఒక్కొక్కప్పుడు పూర్తి సున్నాతో వత్తి పలికేవారట. ఒక్కొక్కప్పుడు తేల్చి ముక్కుతో పలికేవారట. తేల్చి పలుకుతున్నప్పుడు అరసున్నా వాడాలి. ఆధునికయుగంలో భాష నేర్చుకోవడం పూర్తిగా పుస్తకాల మీదనే ఆధారపడుతున్న పరిస్థితుల్లో సరైన అర్థం తెలియడానికని అరసున్నా చేర్చే నిబంధన పెట్టుకుని ఉంటారు.

ఇలాంటి విషయాల్లో ఒక్కొక్కప్పుడు రాసినదానికీ, ఉచ్చారణకూ సంబంధం ఉండేది కాదు. రామచంద్రగారు 1065 నాటి శాసనంలోని ఈ పద్యాన్ని ఉదహరించారు.

“సకల వశుమతీశ మకుటలసద్రత్న
కిరణరుచి విరాజి చరణుణ్డయిన…”

ఇందులో చివరి పదాన్ని చరణుడయిన అనే చదవాలి. లేకపోతే ఆటవెలది నడక చెడిపోతుంది. ఇటువంటి పద్ధతుల కారణంగా మనకు ప్రాచీనకాలపు తెలుగు అక్షరాలు చదవడానికి కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ చదవగలిగినా ఈ అన్నమాచార్య రచనలాగా కొంత గందరగోళంగా అనిపిస్తుంది.

“…అద్దమరాతిరి దాంకా నంద్దు నింద్దు నుండ్డి వచ్చి వొద్దురవోరా
నీకు నింత్త వొలశి నొల్లములు..”.

ఇప్పటి తెలుగు ఉచ్చరించే పద్ధతిలో ఫోనెటిక్‌గా ఉంటుంది కనక మనకు అంత ఇబ్బందిగా ఉండదు. అయినా మామ, చీమ, దోమ వగైరా పదాలను కోస్తావారిలాగా తక్కిన తెలుగువారు మాఁవ, చీఁవ, దోఁవ అనకపోవడం చూస్తూనే ఉంటాం.

లిపులవల్ల ఈనాడు ఎన్నెన్నో ఉపయోగాలున్నాయి కనకనే వాటి ఉచ్చారణ గురించి ఎంతో చెప్పుకోవడం వీలవుతోంది. కానీ ఆనాడైనా, ఈనాడైనా అక్షరాల ముఖ్య ప్రయోజనం ప్రజలకు సమాచారాన్ని అందించడమే. రాసిపెట్టిన సమాచారం ఒకేసారిగా అనేకమందికి కనిపించినప్పుడో, అనేక సమయాల్లో అనేక తరాలకు అందుబాటులోకి వచ్చినప్పుడో సార్థకమవుతుంది.

సామాజిక ప్రయోజనమే రాసినది చదవడంలోని ముఖ్య విషయం. ఎందుకంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు తమకు మాత్రమే అర్థమయే రహస్యలిపిలో సందేశాలు రాసి పంపుకోవచ్చు. అది ఇతరులకేమీ ఉపకరించక పోవచ్చు. ప్రపంచంలో వ్యాప్తి చెందినవన్నీ అందరికీ ఉపయోగపడే రచనా పద్ధతులే. నాగరికత పెరిగి విస్తరించడానికి ఇవి చాలా తోడ్పడ్డాయి. కానీ ఈనాటి సమాచారవ్యవస్థలోని అతిముఖ్య అంశంగా పరిణమించిన లిపులు గతంలో విదేశీయులు ప్రవేశపెట్టినదాకా ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో తలెత్తనే లేదు. వీటిలో ఆస్ర్టేలియా, పసిఫిక్‌ దీవులూ, ఆఫ్రికాలో భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న ప్రదేశమూ, (మధ్యఅమెరికా ప్రాంతం మినహాగా) మొత్తం రెండు అమెరికా ఖండాలూ మొదలైనవి ఉన్నాయి. ఇతర నాగరికతలకు చెందిన అన్వేషకులూ, ఆక్రమణదారులూ ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారికి బోలెడంత లిఖితపూర్వకమైన సమాచారం సహాయపడింది. ఇందులో వారు స్థానికులపట్ల అవలంబించవలసిన వైఖరిని గురించిన అధికారిక సూచనలూ, పనికొచ్చే చరిత్ర వివరాలూ, యుద్ధ ప్రణాళికలూ మొదలైన వివరాలెన్నో ఉండేవి. వీటి సహాయంతో వ్యక్తిగతంగా గొప్ప తెలివితేటల అవసరం లేకుండా నిరక్షరాస్య సమాజాలను ఇతరులు సులువుగా లోబరుచుకోగలిగారు. అప్పటికే కొన్నివేల ఏళ్ళుగా పెంపొంది ఉన్న వారి నాగరికత వారికి పరోక్షంగా తోడ్పడిందనుకోవచ్చు.

అతిప్రాచీనమైన సింధునాగరికత ఎంత సువిశాలమైనదో ఆధునికులకు తెలియాలంటే.. అందులో ఈనాటి పాకిస్తాన్‌ పూర్తిగానూ, భారత, అఫ్ఘానిస్తాన్‌ దేశాల్లోని అనేక భాగాలూ ఉండేవనేది చెప్పాలి. 50 లక్షల జనాభాతో విలసిల్లిన ఈ నాగరికతకు చెందిన 800 కేంద్రాల ఆచూకీ ఇప్పటివరకూ తెలిసింది.

కానీ చరిత్రలో జరిగిన విచిత్ర పరిణామాల కారణంగా నాగరికతలన్నిటికీ పుట్టినిల్లయిన ఇరాక్‌ ప్రాంతంలో ఈనాడు ఎక్కువమంది నిరక్షరాస్యులుండగా జపాన్‌లోనూ, స్వీడన్‌ మొదలైన దేశాల్లోనూ ఎక్కువ అక్షరాస్యత కనబడుతోంది. చదవడం, రాయడం పుట్టుకతో వచ్చే విద్యలుకావు కనక వీటికి శిక్షణ అవసరం. 2000లో జరిపిన సర్వేప్రకారం మనదేశంలో కనీసస్థాయి అక్షరాస్యత పురుషుల్లో దాదాపు 68 శాతం, మహిళల్లో 42 శాతం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సంఖ్యలు మన పొరుగుదేశాలైన పాకిస్తాన్‌లో 58, 28 కాగా, బంగ్లాదేశ్‌లో 52, 30 అనీ, శ్రీలంకలో 95, 89 అనీ తేలింది. ఈనాడు సిటీ బస్సు నంబర్ల దగ్గర్నుంచీ ప్రతిదీ అక్షరాల రూపంలోనే కనిపిస్తుంది కనక చదువు రాకపోతే లాభం లేదు.

యునెస్కో జరిపిన పరిశీలనలను బట్టి చూస్తే నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పేదరికమూ, తక్కువ ఆయుఃప్రమాణమూ, వెనకబాటుతనమూ, రాజకీయ నిరంకుశత్వమూ కనిపిస్తాయి. ఎటొచ్చీ అక్షరాస్యత అనేది వ్యక్తిగత సుఖసంతోషాలకు గాని, సమాజంలో ఆర్థిక ప్రగతికిగాని, ప్రజాస్వామిక వ్యవస్థకుగాని కారణం అవుతుందని చెప్పలేం. ప్రపంచ జనాభా పెరుగుతున్నకొద్దీ నిరక్షరాస్యుల సంఖ్యకూడా పెరుగుతోంది. క్యూబా, చైనా, టాంజానియా, నికరాగువా మొదలైన దేశాలు చేపట్టిన కార్యక్రమాలు నిరక్షరాస్యతను తగ్గించడంలో మంచి ఫలితాలు సాధించినట్టుగా తెలుస్తోంది.

మనదేశంలో లిపి చరిత్ర ప్రాచీనమైనది. అది మొదటగా తలెత్తిన నాగరికత సింధునది ప్రాంతంలో మొదలైనట్టుగా వింటాం. దాదాపు రెండులక్షల సంవత్సరాల క్రితం పుట్టుకొచ్చిన ఆధునిక మానవజాతి ప్రజలు కనీసం లక్షసంవత్సరాల క్రితమే ఆఫ్రికానుంచి ఆసియా, మొదలైన తక్కిన ప్రాంతాలకు వలసవెళ్ళినట్టుగా తెలుస్తోంది. వీరంతా సింధునది సమీపంలోనేకాక, మన దేశమంతటా స్థిరపడ్డారు. అయినప్పటికీ సింధునాగరికత ఎంతో విశిష్టమైనది. అక్కడ నిర్మించబడ్డ గొప్ప నగరాలూ, వీధుల రూపకల్పనా, తాగునీటికీ, మురుగునీటికీ అద్భుతమైన ఏర్పాట్లూ వగైరాలకు సాటిరాగల సమకాలీన నాగరికతలేవీ కనబడవు. నేటి పాకిస్తాన్‌లో 1920లలో జరిపిన మొహెంజోదడో, హడప్పా ప్రాంతాల్లో తొలి తవ్వకాలలో బైటపడ్డ అపూర్వమైన విశేషాలు సంచలనం కలిగించాయి. క్రీ.పూ. 2600-1900 మధ్యలో ఉచ్ఛదశకు చేరుకున్న ఈ నాగరికతలో లిపిని గురించిన ఆధారాలుకూడా దొరికాయి.

వేల సంవత్సరాల క్రితపు రచనా విశేషాలు చరిత్రకారులకు చిక్కు సమస్యలుగా తయారవడం మామూలే. ఎందుకంటే ప్రాచీన నాగరికతలన్నీ నేటిదాకా కొనసాగకుండా మధ్యలో ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయినవే. అప్పటి లిపులూ, భాషలూ అన్నీ ఎటువంటి సజీవ సాక్ష్యాలనీ మిగల్చకుండా మరుగునపడిపోయినవే. ఉదాహరణకు క్రీ.పూ.3300 ప్రాంతాల మొదలై, 3 వేల ఏళ్ళు అవిచ్ఛిన్నంగా కొనసాగిన ఈజిప్ట్‌ నాగరికత ప్రాచీన గ్రీక్‌ పర్యాటకులనుంచీ అనేకమందిని అద్భుతపరిచింది. అప్పటివారు నిర్మించిన బ్రహ్మాండమైన పిరమిడ్లనూ, దేవాలయాలనూ, ఇతర నిర్మాణాలనూ ఎందరో ఎంతో ఆసక్తితోనూ, ఆశ్చర్యంతోనూ పరిశీలించారు. కానీ వారి భాష గురించి తరవాతి యుగాల్లో ఎవరికీ తెలియలేదు. వారి చిత్రలిపిని గురించి ఎందరో పరిశోధనలు జరిపినప్పటికీ నెపోలియన్‌ కాలందాకా అది చిక్కుముడిగానే మిగిలిపోయింది.

ఎందరో విఫలయత్నాలు చేశాక 1821లో షాంపోలియోఁ అనే ఫ్రెంచ్‌ పరిశోధకుడి బృందానికి మూడు విభిన్న లిపులలో శాసనాలు చెక్కిన రోసెటా శిల ద్వారా సమాధానం లభించింది. అందులో ఒకే సమాచారాన్ని ప్రాచీన ఈజిప్ట్‌ చిత్రలిపి లోనూ, తరవాతి కాలపు డెమోటిక్‌ లిపిలోనూ, గ్రీక్‌ లిపిలోనూ రాసిఉంచారుకనక ఎలాగో అలా తంటాలుపడి ఈజిప్ట్‌ చిత్రలిపిని చదవగలిగారు. అలాగే మెసపొటేమియావారి కీలలిపి (క్యూనీఫాం) నమూనాలు యూరప్‌నుంచి వెళ్ళిన అన్వేషకులకు పదిహేడో శతాబ్దంలోనే లభించాయి కాని వాటిలో ఒకటి మూడు విభిన్న లిపులు కలిగినది కావడంతో కొన్ని దశాబ్దాల పాటు పరిశీలనలు జరిపిన మీదట సమస్య పరిష్కారమయింది. మన దేశానికి మాత్రం అటువంటి అవకాశమేదీ లభించలేదు.

రోసెటా శిల

సింధునాగరికత గురించి మొదటినుంచీ అనేక వివాదాస్పద సమస్యలుంటూనే ఉన్నాయి. మనవాళ్ళకు మొదటినుంచీ చారిత్రకదృష్టి కన్నా సంప్రదాయబద్ధమైన వీరావేశాలు ఎక్కువ. హిందువులకు వేల సంవత్సరాలుగా వేదాలమీద అపారమైన విశ్వాసమూ, భక్తిశ్రద్ధలూ ఉన్నాయి. లోకాయతవాదమూ, బౌద్ధ జైనాలూ తప్ప తక్కిన భారతీయ తత్వ్తధోరణులన్నీ వేదాలను ప్రామాణికమైనవిగా భావిస్తాయి. అందుచేత అవి ఎవరూ రాయనటువంటి అపౌరుషేయాలనీ, బ్రహ్మ ముఖంనుంచి పుట్టుకొచ్చాయనీ నిజంగానే నమ్మేవాళ్ళు ఈనాటికీ చాలామంది కనిపిస్తారు. ఇటువంటి నమ్మకాలేవీ లేని చరిత్రకారులు మాత్రం క్రీ.పూ.1500 ప్రాంతాల రచించబడ్డట్టుగా వేదాలకు కాలనిర్ణయం చేశారు. సింధునాగరికత మాత్రం అంతకు వెయ్యేళ్ళ ముందునుంచీ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది.

అక్కణ్ణించీ చిక్కులు మొదలయాయి. ఆర్యులనబడేవారు మధ్యఆసియానుంచి మనదేశానికి వలసవచ్చారనీ, సింధునాగరికత అప్పటికే వర్ధిల్లుతూ ఉందనీ చరిత్రకారులు అన్నారు. దీనర్థం ఏమిటంటే స్థానికులది ద్రావిడసంస్కృతి అని. దీనికి సనాతన హిందూమతాభిమానులు అంగీకరించరు. వేదాలు రచించిన ఆర్యసంస్కారం ఈ “పుణ్యభూమి”కి చెందినదేననీ, అంత గొప్ప ఆర్యజాతి మనకు విదేశీయం కాజాలదనీ ముఖ్యంగా ఉత్తరాదివారు వాదిస్తారు. ద్రావిడ సంస్కృతి అనేది ఏమైనప్పటికీ అది ఆర్య సంస్కృతికన్నా నీచమైనదని వారు స్పష్టంగా అనకపోయినా వారి ఉద్దేశం అదే అనిపిస్తుంది. ఇంతకీ వేదాలది సంస్కృతభాష. (ఇది మనం అనుకునే సంస్కృతం కాదనీ, మరేదో దేవభాష అనీ చెప్పే మేధావులూ ఉన్నారు). దీనికీ సింధులిపికీ ఏ సంబంధమూ కనబడదు.

సింధు నాగరికతలో దొరికిన లిపి ఆనవాళ్ళన్నీ ముద్రికల రూపంలో ఉన్న అచ్చులు. సుమారు 2 వేలకు పైగా దొరికిన ఈ ముద్రికలను బంకమట్టి ముద్దలవంటి వాటిమీద గుర్తులు వెయ్యటానికి ఉపయోగించి ఉంటారు. అక్కడివారికి అప్పటికే మెసపొటేమియా ప్రాంతం ప్రజలతో వర్తకవాణిజ్యాలు జోరుగా సాగుతూ ఉండేవి. సరుకుల బంగీలమీద ముద్రలు వేసి ఎగుమతి చేసేవారని మెసొపొటేమియాలోని సాక్ష్యాలవల్ల తెలుస్తోంది. అతిప్రాచీనమైన సింధునాగరికత ఎంత సువిశాలమైనదో ఆధునికులకు తెలియాలంటే.. అందులో ఈనాటి పాకిస్తాన్‌ పూర్తిగానూ, భారత, అఫ్ఘానిస్తాన్‌ దేశాల్లోని అనేక భాగాలూ ఉండేవనేది చెప్పాలి. 50 లక్షల జనాభాతో విలసిల్లిన ఈ నాగరికతకు చెందిన 800 కేంద్రాల ఆచూకీ ఇప్పటివరకూ తెలిసింది. వీటిలో సింధునదీ తీరాన ఉన్నవి వందకు లోపే. ఇంత పెద్ద స్థాయిలో వర్ధిల్లిన నాగరికతలో లిపి ఉపయోగం జరిగేఉండాలి.

దురదృష్టవశాత్తూ మనకు దొరికిన ముద్రికల్లో ఏది చూసినా 5 నుంచి 26 గుర్తులే కనిపిస్తున్నాయి. ఇవన్నీ అక్షరాలా, పదాలా, శబ్దాలకు సంకేతాలా అనే విషయం 70 ఏళ్ళ క్రితం దాకా తెలియనేలేదు. ఆ తరవాత సోవియట్‌ యూనియన్‌, ఫిన్లండ్‌ మొదలైన దేశాలకు చెందిన పరిశోధకులూ, భారత, పాకిస్తాన్‌ శాస్త్రవేత్తలూకూడా పరిశీలనలు జరిపి ఈ లిపిని చదవగలిగే స్థాయికి చేరుకున్నారు. ఎటొచ్చీ వీరిలో తీవ్రమైన అభిప్రాయభేదాలున్నాయి.

సింధు ముద్రిక

సింధు నాగరికతలో దొరికిన ముద్రిక

విస్తృతంగా పరిశీలనలు జరిపిన పార్‌పోలా (ఫిన్లండ్‌), అతనితో అంగీకరించిన ఐరావతం మహాదేవన్‌ తదితరులు ఈ భాష తమిళాన్ని పోలిన ద్రావిడభాష అని భావిస్తున్నారు. ఉత్తర భారతీయ పరిశోధకులైన మధుసూదన్‌ మిశ్రా వంటివారు మాత్రం అది తప్పనీ, ఆ గుర్తులన్నీ సంస్కృతాన్ని పోలిన అక్షరాలకు సంకేతాలనీ అంటున్నారు. కెనడాలోని పరిశోధకులు కొందరు మరికొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు.

సింధులిపికీ తెలుగు, తదితర ద్రావిడ భాషలకూ సంబంధం ఉండవచ్చని కొందరంటే, సింధులిపిని ఈనాటికీ వాడుతున్న ఆదివాసీ తెగలు బిహార్‌లో కనబడుతున్నాయని మరికొంద రంటున్నారు. ఈ ప్రతిపాదనలకు కొంత ప్రాధాన్యత కనిపిస్తుంది. ఎందుకంటే సింధు నాగరికత ద్రావిడులకు సంబంధించనిదని అంటున్నవారు ముఖ్యంగా పేర్కొనే కారణం సింధునది ప్రాంతంలో తరవాతి కాలంలో ద్రావిడ సంస్కృతి కనబడటం లేదన్నదే. తరవాతి యుగాల్లో ఇండో ఇరానియన్‌ సంస్కృతికి చెందిన ప్రజలు చేసిన అనేక దాడుల కారణంగా ద్రావిడ సంస్కృతి తూర్పుదిక్కుకూ, దక్షిణాదికీ తరలి ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ ప్రతిపాదనలే. వీటి నిరూపణకై ఎన్నో సాక్ష్యాలు సేకరించవలసి ఉంది. వ్యక్తిగత భావాలూ, ఆవేశాలూ ఎటువంటివైనా, వీటి గురించి చదివి తెలుసుకుంటూ ఉండడమే మనవంటి సామాన్యుల పని. వాదోపవాదాలూ, చర్చలూ నిపుణులైన పరిశోధకులు మాత్రమే చెయ్యాలి.

ఇవన్నీ అలా ఉంచితే అసలు లిపుల్లో అత్యంత ప్రాచీనమైనది సుమేరియన్‌ కీలలిపి కాదనీ, సింధునాగరికతకు చెందినదేననీ 1999లో బిబిసి ప్రకటించింది. అయిదున్నర వేల ఏళ్ళనాటి కుండపెంకులమీద గీసిన గుర్తులే ప్రపంచంలో అన్నిటికన్నా మొదటి లిపికి నమూనా అని పరిశోధకులు చెపుతున్నారు.

హడప్పా ప్రాంతంలో దొరికిన పెంకు

హడప్పా ప్రాంతంలో దొరికిన పెంకు

హడప్పా ప్రాంతంలో దొరికిన ఈ పెంకు మీది గుర్తులు కుండను ఆవంలో కాల్చక ముందూ, తరవాతా కూడా గీసినట్టుగా కనిపిస్తున్నాయని వారు చెప్పారు. ఈ గుర్తులకు కుండలోని పదార్థంతోనో, దేవతలతోనో సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఈ లిపి గురించీ, తక్కిన నమూనాల గురించీ మనకేమీ తెలియకపోవడానికి కారణం ఈ భాషకు తరవాత వారసత్వమేదీ మిగలకపోవడమే. వేదకాలంలో లిపికి ప్రాధాన్యత ఉన్నట్టు కనబడదు. భారతదేశపు లిపులన్నిటికీ మూలమైన బ్రాహ్మీ లిపి క్రీ.పూ. నాలుగో శతాబ్దం తరవాత ప్రాచుర్యంలోకి వచ్చినట్టుగా భావిస్తున్నారు.

———————————

కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) నుండి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త. తెలుగులో http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) అనే బ్లాగులు రాస్తూంటారు.

Posted in వ్యాసం | 4 Comments

జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం

– వీవెన్, చదువరి

2008 జూన్
-తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల పర్యవసానాలు చవిచూసిన నెల
-ఆంధ్రజ్యోతి, మంద కృష్ణ మాదిగల మధ్య తారాస్థాయి యుద్ధం – పర్యవసానంగా పాత్రికేయులను పోలీసులు నిర్బంధించిన నెల
-దేవేందర్ గౌడ్ తెదేపా నుండి బయటికి వచ్చిన నెల
-పెట్రోలు, డీజిలు, గ్యాసు ధరలు తారాజువ్వల్లాగా ఎగసిన నెల.
వెరసి టపాలకు మంచి విషయాలు దొరికిన నెల.

బ్లాగుల్లో సాధారణంగా స్వగతాలో, జ్ఞాపకాల నెమరువేతలో, సమకాలీన రాజకీయ, సామాజిక అంశాల గురించో, సినిమాల గురించో చర్చలుంటాయి, అభిప్రాయాలూంటూంటాయి. సాహితీ సమీక్షలుంటాయి. అరుదుగానైనా.., లోతైన విశ్లేషణలూ సూత్రీకరణలు కూడా ఉంటూంటాయి. చాన్నాళ్ళ కిందట పప్పు నాగరాజు కవిత్వ లక్షణాలను వివరిస్తూ, కవిత్వాన్ని ఎలా ఆస్వాదించాలో విశ్లేషిస్తూ వాక్యం రసాత్మకం కావ్యం అంటూ చక్కని విశ్లేషణాత్మక, విజ్ఞానదాయక వ్యాసాలు రాసారు. గుండెచప్పుడులో సామాజిక, ఆర్థికాంశాల మీద అలాంటి టపాలు వస్తూంటాయి. అటువంటి ప్రయత్నాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. ఈనెల అలాంటి టపాలు కొన్నొచ్చాయి. అవి:

చర్చలు

హాస్యం/వ్యంగ్యం

సామాజికం/రాజకీయం

ఈ నెల ముఖ్యాంశాలు: ఉప ఎన్నికలలో తెరాసకి ఎదురుదెబ్బ, ఇందన ధరల పెంపు, నెల చివర్లో తెలుగుదేశం పార్టీ నుండి దేవేందర్ గౌడ్ రాజీనామా.

స్వగతాలు, స్వ గతాలు

సాహిత్యం

సినిమా

ఈ నెల విశేషం పాండురంగడు సినిమానే. ఆ తర్వాత దశావతారం.

ఇతరత్రా

కొత్త బ్లాగులు

ఈనెల బ్లాగు

ఆ బ్లాగు పుట్టి రెండే నెలలైంది. రెణ్ణెల్లలోనూ 40కి పైగా జాబులొచ్చాయి. ఎత్తిపోతల కార్యక్రమంలో ఎక్కడినుండో తెచ్చిపెట్టిన సరుకేం కాదది; బ్లాగరి మేధలోచి ఉద్భవించిన అసలు సిసలు ఆలోచనలే ఆ జాబులు. చాలా జాబులు ‘కత్తి‘లా ఉన్నాయని వ్యాఖ్యాతలు అన్నారు. పర్ణశాల ఆ బ్లాగు, కత్తి మహేశ్ కుమార్ ఆ బ్లాగరి. తన కాలేజీ కబుర్ల గురించి రాసినా, తెలుగు సినిమా గురించి రాసినా, మానవ సంబంధాల గురించి రాసినా ఆయన ఆలోచనలు ఆసక్తికరంగా ఉంటాయి. చదివింప జేస్తాయి. ఆయన భావాలు కొన్ని వైవిధ్యంగా ఉండి, కొంతమందికి ఆమోదయోగ్యంగా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. విభేదించినవారితో అర్థవంతమైన చర్చకు ఈ బ్లాగరి సిద్ధంగా ఉంటారు.

తన బ్లాగులోనే కాక, ఇతర బ్లాగుల్లోనూ వ్యాఖ్యలరూపంలో మహేశ్ తరచూ కనిపిస్తూంటారు. జూన్ నెలలో వివిధ బ్లాగుల్లో జరిగిన చర్చల్లో వేడీ వాడీ కలిగిన వాటిలో మహేశ్ పాత్ర ప్రముఖంగానే ఉంది. నవతరంగంలో సినిమా విశ్లేషణలు కూడా రాస్తూంటారు.

—————

-వీవెన్, చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యులు

Posted in జాలవీక్షణం | Tagged , , , | 13 Comments

అలివేలు మంగమ్మకొక దండం

-నామిని సుబ్రహ్మణ్యం నాయుడు

మా ఇంటి ముందర చేపల గంప దింపించినా.

మడికాడికి ఆవును తోలకపోతా వుండిన కర్రెక్కా, బోరింగు కాడ బోకులు తోముకుంటుండిన కడుపక్కా, మొగుడికి చద్ది పోస్తాపోస్తా వుండిన నీలావొతీ అందురూ చేపల గంప చుట్టూరా వుడ్డజేరి పొయ్‌నారు.

“నా పెండ్లాం మాట వినబోకండి. అది ప్రతిదీ తీసేసి మాట్లాడేస్తింది. గాందీ తాతను గూడ కమీనిస్టోళ్లన్నట్టు ‘వోడా?’ అనేస్తింది. మనింటి ముందరికి చేపలొచ్చినాయి గదాని కేవిలంగా అడగబోకండి. అవే చేపలు తిరప్తిలో అయితే కేజీ నలపై రూపాయలు!

చేపలు తెచ్చిన ఆడ మనిసి – రాయలచెరువు పేట ముండమోపి.నాకు చిన్న తమాస చేద్దామనిపించింది.

నేను చేపల గంపలో చెయ్యిబెట్టి, “ఇవి గెరిగేన్లు గదా, బలే వుండాయ్, తెల్లారుజామున్నే పట్టినట్టుండారు, కొన్ని ప్రాణాల్తోగూడ వుండాయే! కండ్లు మూస్కోని కొనుక్కోవచ్చు – కేజీ ఇరైఅయిదు రూపాయల్లెక్కన. మ్మో, మాకొక కేజీ తూంచు!” అన్నా కేజీ తక్కిడ చేపలామె చేతల్లోబెట్టి.

అంతే ఆ నిమిసంలోనే అక్కడంతా గలాంబులాం అయిపొయ్యింది.

అంతమంది ఆడోళ్లముందర నన్ను పట్టుకొని కొట్టలేక నా పెళ్లాం పండ్లు పటపట కొరికి, “నువ్వు ఏమిటి మొగోడుగా వుందువు? వూళ్లో ఇంతమంది మొగోళ్లుండారు, వొక్కడన్నా చేపల గంప కాడికొచ్చినాడా? మొగోడికి బేరం జెయ్యనొచ్చా? అసలవి కొరమేన్లన్నా కావే. గెరిగేన్లకు ఇరై అయిదు రూపాయలు పెడతారా ఎవురన్నా? ఆడోళ్లు బేరం చేస్తారు. నువ్వు నోర్మూస్కోని ఇంట్లేకి పో. అరకేజీ ఎత్తుకుని నీ గుంత మింద యేస్తాన్లే!” అనింది.

ఆడోళ్లు గూడ ఒక్కొక్కరే నా మిందికి తగులుకోబోతుండగా నేను గూడా నోరడ్డం యేస్కోని, “ప్రబావొతీ, నువ్వు ఇంట్లో ఒక మూల కుచ్చునే ఆడదానివి. నీకు లోకం ఏం తెల్చు చెప్పు? నేనంటే పదిమందిలోకి పొయ్యేవోణ్ణి వొచ్చేవోణ్ణి. పదూళ్లు తిరిగినోణ్ణి. మొన్న తిరప్తిలో రెడ్డమ్మ మెస్సులో చేపను పెట్టించుకోని తిన్నా. అది ప్లేటులో చేప తలకాయి, తోకా పెట్టి – అందుగ్గాను ఏడ్రూపాయలు వొసూల్జేసింది! ఆ లెక్కన లెక్కేస్కో. అంతెందుకు గంగిరెడ్డిపల్లిలో మేకను కోసి మేకపోతన్జెప్పి పొట్టతోళ్లూ, ఎనికలూ యేస్తే కేజీ కూరెంత? ముప్పైయ్యార్రూపాయలు. అందునా ఇవి మన చెరువు చేపలు. తేనె వున్నట్టుంటాయి. నీకేం తెల్చే లంజా, ఒక కేజీ చేపలు తీస్కో!” అన్నా.

నా పెళ్లాం వొళ్లు మరిచిపొయ్, “చూడమ్మా, ఆ మొగోణ్ణి ఏం జేస్తే కర్మ తీరునుమా?” అనడిగింది కర్రెక్కను.

కర్రెక్కా కడుపక్కా నీలావొతీ ముగ్గురూ ఒకే దపా మాటల్తో నామిందికి రాబోతుండగా నేను వూరెత్తకపొయ్యేటట్టు గొంతుపెంచి, “నా పెండ్లాం మాట వినబోకండి. అది ప్రతిదీ తీసేసి మాట్లాడేస్తింది. గాందీ తాతను గూడ కమీనిస్టోళ్లన్నట్టు ‘వోడా?’ అనేస్తింది. మనింటి ముందరికి చేపలొచ్చినాయి గదాని కేవిలంగా అడగబోకండి. అవే చేపలు తిరప్తిలో అయితే కేజీ నలపై రూపాయలు! ఇంక మీ యబ్బతోడు, వూరు గాబట్టి ఇరై అయిదు ఇయ్యొచ్చు!” అనేసి నేను కడగా వొచ్చి తిన్నెమింద కుచ్చునేసినా.

ఇంతసేపుటిగ్గానూ చేపలామె నోరు తెరిచి, “ఆయన్న కరట్టుగా మాట్లాడినాడు. తప్పు రూంత గూడా మాట్లాళ్లా. నేనూ కాలిక్కాలికి కొట్టుకుంటా రాయల్చెరువు పేట నుంచి తెచ్చినాను గదమా. అక్కణ్ణే నేను కేజీ ఇరై రెండు లెక్కన తెచ్చినా. నాకు కాలి తిప్పట కన్నా కూలి దక్కద్దా? ఆయన్న చెప్పినట్టు ఇరై అయిదు గాక పొయ్‌నా ఇరై మూడు పెట్టుకోని ఎత్తుకోండి. చేపలు బాగుండాయి. తిరప్తిలో మొన్నంతా కనాగష్టం ఎరగడ్డలు కేజీ పన్నెండు రూపాయలు అమ్మలేదంటమ్మా?” అని లాపాయింటు తీసింది.

చేపలామె మాటలినిన కడుపక్కకు వొళ్లు మండిపొయ్, “మ్మో నువ్వు గూడ బాగ దొబ్బేదానివిగా వుండావే! ఆ నాబట్టకు బేరం జేసేది తెల్చునా? వాడు మూడు మొకాల్ తెలవనోడు. గెరిగేన్లను మేమెప్పుడూ తీస్కోలేదా, తిన్లేదా? కేజీ పదార్రూపాయల్లెక్కన పెట్టుకో. తలా కేజీ తీస్కుంటాం. మద్యానానికంతా నువ్వు ఇల్లు జేరిపోతావు.” అనింది.

నేను నేరుగా ఇంట్లేకిపొయ్ ఇరై అయిదురూపాయలు బొడ్లో దోపుకొని బైటకొచ్చి, బోకునొకదాన్ని చేపలామె చేతికిచ్చి, “మ్మో కేజీ తూంచు. ఇరై అయిదు రూపాయలకే తూంచు. నాకు నీ కష్టం వొద్దు తల్లా! ఎవురెవురి కష్టమో తిని ఈ జల్మ ఎత్తినాం. మళ్లా నీ కష్టం తిని నీకు పుట్టి రుడం తీర్చుకోలేను.” అన్నా.

నా పెళ్లాం నన్ను వడేసి పట్టుకోబొయ్ వీలుగాక నా చేతల్లో వుండే ఇరై అయిదును పెరుక్కుందామని జూసింది.

‘నన్ను ఇజీవాడకు తొడకపో, నేను కనకదుర్గ గుడి జూడాల’ అని నన్ను చంపతా వుంటావు గదా! ఇందాక మనింటి ముందరికి చేపలు తెచ్చిందెవరనుకున్నావు? దుర్గమ్మ తల్లే!

చేపలామె కేజీ తూంచి బోకులో పోసింది. నేనే డబ్బును గంపలో యేసేసి ఆ బోకునెత్తుకుని ఇంట్లేకి పొయ్‌నా. నాపెండ్లాం – ఇంక ఎక్కువ మాట్లాడితే వూళ్లోవోళ్లు నవ్వుకుంటారన్జెప్పి గమ్మనుండి పొయ్యింది.

నా తమాస చూస్తా బొమ్మలాల నిలుచుకునిన ఆడోళ్లు కడాకు నోళ్లు తెరిచి, “వొరె, కోతి నాబట్టా!” అనేసి పూడ్సినారు.

ఇంట్లో నేనూ, ఇంటి ముందర నా పెళ్లాం మిగిల్నాం. ఇంక ఎంత యిద్దం జరగబోతాదో!

ఈ చేపల్ని ఎప్పుడెప్పుడు తోమి – తినేద్దామా అన్నట్టు నా పెళ్లాం గూడా తపన్లో వుండాది. నేనిదే చాన్సనుకోని, “ప్రబావొతీ! మూతి మూరడు పొడుగు పెట్టుకోవద్దమ్మా! నా బుజ్జి గదా! నువ్విప్పుడు నవ్వతావు. నవ్వకుంటే నేను చచ్చినట్టు!” అని నెత్తిన చెయ్యి పెట్టుకున్నా.

ప్రబావొతి నవ్వి నా నెత్తిన చెయ్యి తీసేసింది.

నేనూ నా పెళ్లాం పెళ్లో చేరి బూడిద ముందర పోస్కోని చేపలు తోమేదానికి పెట్టుకున్నాం.

“నువ్వెన్నన్నా అను ప్రబల్ కన్నా! నాకు ముండమోపులంటే బలే యిష్టిం!” అన్నా.

“అవున్లే వాళ్లకైతే మొగుళ్లుండరు. ఇష్టమొచ్చినట్టు ఆడించొచ్చని నీ ప్లాను!” అనింది నన్ను జడతో వొకటి కొట్టి.

“అంత వక్రంగా అంటే నేనేం జెప్పేది? ఇప్పుడా ముండమోపి ఆడమనిషి నిద్దర్లేచి రాయలచెరువుపేట నుంచి పదికేజీల చేపల్ను మారు బేరానికి తెచ్చుంటాది. అక్కణ్ణే పదైదు రూపాయలు పడుంటాయి కేజీ. ఇంక వూళ్ల మింద పడి తిరిగితే కేజీ మింద రెండ్రూపాయలు ఇయ్యబోతారు మహా అయితే. అంటే ఆమె దినుమంతా కష్టిపడితే ఇరైరూపాయలు. చెరువెండిపోతే ఆ ఆదాయికమూ వుండదు. నేను ఆంద్రజోతిలో ప్యానుకింద కూచ్చోని నెలకు రెండున్నర వేలు తెస్తుండానే! ఆ డబ్బు మదంతోనే నీకిప్పుడు బాదలనేవి తెలవ్వు. ఒకేళ నేను మర్‌గయా అయినాననుకో. నువ్వు నీ బిడ్డల్ను సాక్కునే దానికి ఏం జేస్తావు – వూళ్లో నాలుగు లీటర్లు పాలు పట్టుకోని పెరుగు జేస్కోని పెరుగ్గంపెత్తుకోని తిరప్తికి పొయ్ ఈదీదీ తిరగతావు. ఎంత కష్టమో చెప్పు -” నన్నింకేం చెప్పనీకుండా నోరు మూసేసింది. ఈ సందులోనే –

ఎగవీది నుంచి ముగ్గురాడోళ్లు,
“నువ్వంత మహరాజు నాబట్టవా?”
“నీ ఇంట్లో చెట్టుకు రూపాయలు కాస్తుండాయా?”
“గెరిగేన్లకు ఇరై అయిదు రూపాయలిచ్చినావా? మా మొగోళ్లు నీకన్నా ముఠాలి ఎదవలే! ఇరై అయిదిచ్చి తీస్కోమని పోరతా వుండారే! ఆ చేపలది ఎంతసేపూ – దిగవీధిలో ఒకన్నకు ఇరై అయిదు లెక్కనిచ్చినా – అని పాట పాడుతుండాది!” అంటా వొచ్చినారు.

“ఎగవీధి అత్తలాలా! నేను గెరిగేన్లను ఇరై అయిదుకే తీసుకున్నా. నా లెక్క పకారం వాటికి ముప్పై ఇయ్యొచ్చు.” అని చెప్పి పంపించినా.

సడే. నా పెళ్లాం బమ్మాండంగా జేసింది చేపలకూర – దండిగా చింత పులుసు పోసి. సంగటేస్కోని తింటావుంటే-

ఎవురో ఒకామె పొరక్కట్టలు ఎత్తకొచ్చి, “జత నాలుగు రూపాయలు. కావాల్నా?” అనడిగింది.

నా పెళ్లాం ఆమె నోటి మాట నోట్లో వుండంగానే కతక్కన, “మాకేం పన్లా. మొన్ననే తీస్కున్నాం. నువ్వు పద!” అనేసింది.

“సరే, అంత సంగటి తినేసి పోదువు రామ్మా! మీది ఏవూరో ఏమో-” అని పిలిచినా, నా పెళ్లాం నాకల్లా వురిమి చూస్తుండినా పట్టించుకోకుండా.

పసి పిలగాడికి మిఠాయిస్తే చెయ్యి జాపినట్టుగా, పాపం ఆమె నా మాటతో గూడా నెత్తి బరువు మా తిన్నెమింద దించి ‘హమ్మ’ అని నోటి గుండా గసొదిలి కూలబడింది.

“ఏ వూరమ్మా మీది?” అన్నా.
“పీలేరు.” అనిందాయమ్మ. ఆయమ్మ ముండమోపిదే, ముప్పై అయిదేండ్లుంటాయి మహా అవితే!

నా పెళ్లాం నన్ను నడవింట్లోకి పిలిచి, “ఏం నువ్వాడే ఆట? దినామూ ఒక మనిసికి సంగటెయ్యాలంటే జరిగే పనేనా? పొరక్కట్టలమ్మే ఆడది కనబడగూడదు, గాజులామె కనబడగూడదు, ముంతమాడి పొండ్లు తెచ్చే ముసిల్ది కనబడగూడదు – నువ్వీ రకంతో దినానికొకర్ని సంగటికి పిలస్తా వుంటే నీకూ నీ పిలకాయలు వుండారు నాయినా! గుర్తు బెట్టుకో!” అని నసకు తగులుకొని మూతి మూరడు పొడుగు బెట్టింది.

“సంగటి తింటావా అనడగంగానే బేదం బెట్టుకోకుండా మన పంచన కుచ్చొనింది. ముద్ద సంగటి, తిన్నన్ని చేపలూ బెట్టు. మనకు మంచిది! ‘నన్ను ఇజీవాడకు తొడకపో, నేను కనకదుర్గ గుడి జూడాల’ అని నన్ను చంపతా వుంటావు గదా! ఇందాక మనింటి ముందరికి చేపలు తెచ్చిందెవరనుకున్నావు? దుర్గమ్మ తల్లే! మన పెండ్లిరోజు వొచ్చినప్పుడల్లా చిత్తానూరు గుడికి పొయ్ దండం బెట్టుకుంటాం గదా! ఏదీ, కండ్లు బాగా తెరిచి చూడు – ఇప్పుడు మనింటి ముందర కుచ్చోనుండే ఆ ఆడామె అలిమేలు మంగమ్మ కాదేమో చెప్పు?”

ఇంతే సంగతులు కింద నా చేవ్రాలు –

————

నామిని సుబ్రహ్మణ్యం నాయుడు చిత్తూరుజిల్లా తిరుపతికి దగ్గరలోని మిట్టూరు అనే గ్రామంలో జన్మించారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో కొన్నేళ్లు ఉపసంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. గణితశాస్త్రంలో M.Sc పట్టభద్రులు. 1980-90 ప్రాంతాల్లో ఆయన చేసిన ‘పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు, మిట్టూరోడి కతలు, మునికన్నడి సేద్యం, పాల పొదుగు’ రచనలు నవీన తెలుగుసాహిత్యంలో విశిష్ఠమైన స్థానం సంపాదించుకున్నాయి.

రోజూ చూసేబతుకులో మీకు ఇంతటి అందం, చమత్కారం కనబడుతోందంటే అది దేవుడిచ్చిన వరం. అది మీ ద్వారా మేం కూడా పంచుకోగలగడం మా అదృష్టం. మీకు ఎల్లప్పుడూ ఈ గొప్ప చూపూ, ముఖ్యంగా sense of humour వుండాలని రాముణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు ఎంత సాధారణ విషయమైనా అసాధారణంగా రాస్తారని తెలుసు. దేవుడు అంతటా వుంటాడని తెలిసినా అపుడపుడు తిరపతో భద్రాద్రో అన్నారమో వెళ్ళి ప్రత్యక్షంగా ఓ దణ్ణం చెప్పుకుంటాం. మీకీ వుత్తరం అలాటిదే.

జగద్విఖ్యాత చిత్రకారుడు, సాహితీప్రియుడు -బాపు, మిట్టూరోడి పుస్తకానికి స్పందిస్తూ నామిని సుబ్రహ్మణ్యం నాయుడుకు రాసిన ఉత్తరంలోని భాగం ఇది; ఒక రచయితకు లభించిన గొప్ప గౌరవం.

Posted in కథ | Tagged , | 3 Comments