‘రమల్’ ప్రశ్న శాస్త్రం-4

'రమల్ 'లో ప్రశ్న తెలుసుకోవడానికి  'ప్రస్తారం / జాయచా ' వెయ్యాల్సిన  అవసరం  ఉంది. ఈ ప్రస్తారంలో   మాతృపంక్తిని  పృఛ్ఛకుడే తన ప్రశ్నని  తలచుకొంటూ ఇస్తాడు. అది పాచికల  ద్వారా ఇవ్వవచ్చు. లేదా సూర్యుని బొమ్మ, దాని   కిరణాలూ వెయ్యడం  ద్వారా  ఎలా  కనుక్కోవచ్చో  తెలుసుకొన్నాం  కదా ?  ఇప్పుడు మరో  విధానాన్ని చెప్తాను:


ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని,  శ్వాస  బిగించి, ఒకే  ప్రయత్నంలో  నాలుగు  వరుసలలో  బిందువులని వెయ్యండి. వేసే బిందువులు పన్నెండు (12) కన్న  తక్కువ  గాని,  ఇరవై (20)  కన్న   ఎక్కువ గానీ ఉండకూడదు. అంటే  12 నుండి  20 లోపల  ఎన్నైనా  వెయ్యవచ్చు. అలా  వేసిన  తరువాత  రెండేసి  బిందువులని  రేఖతో  కలుపుతూ  వెళ్లండి.  అలా  కలుపుకొంటూ  పోగా,  బిందువు  మిగిలితే,  దానిని  ఒకచోట  వ్రాసుకోండి.  అలాగే  మిగతా  మూడు  వరసలతోనూ  ఇదే  వరస!  అలా  ఏర్పడిన  నాలుగు  చిహ్నాలతో  మొదటి  ఖానా  లోని  మొదటి మూర్తి  తయారవుతుంది. మిగతా  మూడు  మూర్తులు  కూడా  అలాగే  రాబట్టాలి. అలా  ఏర్పడిన  నాలుగు  మూర్తులతో  'మాతృ పంక్తి' తయారవుతుంది !

 

ఉదాహరణ :
(1)  ౦-౦  ౦—౦ ౦—౦ ౦—౦ ౦—౦ ౦—౦ ౦—౦ ౦—౦ ౦  = ౦ ( కబ్జుల్ ఖారీజ్)
(2 )  ౦–౦ ౦—౦ ౦—౦   ౦—౦ ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦ ౦—౦   =    ___   (పాత్ )

(3 )  ౦–౦  ౦—౦  ౦—౦   ౦—౦   ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦  ౦  =                   ౦

(4 )  ౦—౦  ౦—౦  ౦—౦  ౦–౦  ౦—౦  ౦—౦   ౦—౦  ౦—౦  ౦—౦ ౦—౦  =      ___

మరొకమారు  ఊపిరి   బిగించి  రెండవ మూర్తి  కోసం , బింవులు పెట్టండి

(1) ౦—౦  ౦—-౦   ౦—-౦  ౦—-౦   ౦—-౦  ౦—-౦  ౦—౦  ౦—-౦  ౦—౦       =     ___

(2) ౦-౦  ౦—౦  ౦-౦  ౦—-౦  ౦-౦  ౦—-౦  ౦—౦  ౦—౦   ౦                 =         ౦

(3) ౦-౦  ౦—౦   ౦—౦  ౦-౦  ౦—౦  ౦—౦  ౦—౦   ౦—౦                      =         ___ (కబ్జుల్ దాఖిల్

(4) ౦-౦  ౦—౦   ౦—౦  ౦—౦  ౦—౦  ౦-౦   ౦—౦  ౦-౦  ౦-౦ ౦           =          ౦   తీక్ష్ణాంశు )

మళ్లీ  మరొకసారి బిందువులతో   మూడవ  మూర్తిని  సృష్టించండి.

(1) ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦  ౦—-౦   ౦—౦  ౦-౦   ౦—-౦  ౦         =        ౦     (కబ్జుల్ ఖారీజ్

(2) ౦—౦   ౦—౦  ౦—౦  ౦—౦   ౦—౦  ౦-౦  ౦-౦  ౦-౦  ౦–౦                 =      ___      (పాత్)

(3) ౦—౦   ౦—౦  ౦—౦   ౦-౦  ౦—౦  ౦-౦  ౦—౦  ౦                            =          ౦

(4)  ౦—౦  ౦-౦  ౦-౦  ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦   ౦—౦                     =          ___

నాల్గవ  మూర్తి  కోసం  మరోసారి  చుక్కలు  పెట్టండి.

(1) ౦—౦  ౦—౦  ౦—౦  ౦-౦  ౦-౦  ౦—౦  ౦-౦  ౦-౦                        =      ___   ( హుమరా)

(2)  ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦  ౦-౦  ౦-౦   ౦-౦  ౦                           =        ౦     (లోహిత్ )

(3) ౦-౦  ౦—౦  ౦—౦  ౦-౦  ౦—౦  ౦—౦  ౦-౦  ౦-౦  ౦                     =      ___

(4) ౦—౦  ౦—౦  ౦-౦  ౦-౦   ౦-౦   ౦-౦  ౦-౦  ౦—౦                       =      ___


ఇప్పుడు  మాతృపంక్తికి  కావలసిన  నాలుగు  ఖానాల  లోని  మూర్తులు   ఏర్పడ్డాయి. వాటితో  ప్రస్తారం తయారు  చేద్దాం  రండి.
 

__

__

__

__

__

__

__

__

__


మాతృ పంక్తి లోని నాలుగు ఖానాలు ఇవి ! వీటిని ఆధారం చేసుకొని,దుహిత పంక్తి లోని నాలుగు మూర్తులు చేద్దాం.
 

__

__

__

__

__

__

__

__

__

.

ఈ విధంగా  ఏర్పడిన  మాతృ  దుహిత  పంక్తుల  ద్వారా , మూడవదైన  దౌహితృ  పంక్తిని  తయారు  చేయాలి. ఎలాగంటే  ఈ  రెండింటి  గుణకార  ఫలితంగా  అవి  ఏర్పడతాయి.  ఒకటి  ఇంటూ  రెండుతో  తొమ్మిదవ  ఖానాలోని   మూర్తిని,  మూడు  ఇంటూ  నాలుగుతో  పదవ  ఖానాలోని  మూర్తిని, అయిదు  ఇంటూ ఆరుతో  పదకొండవ  ఖానాలోని  మూర్తిని, ఏడు  ఇంటూ  ఎనిమిదితో  పన్నెండవ  ఖానాలోని  మూర్తిని  తయారు  చేయాలి.


గుణకారం  లోని  నియమాలు  ఏవంటే  బిందు X బిందు  =  రేఖ,  రేఖ X రేఖ  =  రేఖ,  బిందు X రేఖ  =  బిందు,  రేఖ X బిందు  =  బిందు  అవుతాయి.  ఉదాహరణకి  మన  ప్రస్తారం  లోని  దౌహితృ  పంక్తిని  వేసి  చూద్దాం.
 

12  ( ఏడు ఇంటూ ఎనిమిది ) అతవేదాఖిల్ 11 ( అయిదు  ఇంటూ ఆరు ) తరీఖ్/ శీతాంశు 10 ( మూడు ఈంటూ నాలుగు ) అతవేదాఖిల్ 9   ( ఒకటీ ఇంటూ రెండు )  తరీఖ్  /శీతాంశు

(౦) ( __)  =    ౦

( __ ) ( ౦ ) =     ౦

( __ ) ( ౦ ) =     ౦

( __ ) (  __ ) = __

( ౦ ) ( __ ) =  ౦

( __ ) ( ౦ ) =   ౦

( ౦ ) ( __ ) =  ౦

( __ ) ( ౦ ) =   ౦

( ౦ ) ( __ ) =  ౦

( __ ) ( ౦ ) =   ౦

( __ ) ( ౦ ) =   ౦

( __ ) (  __ ) = __

( ౦ ) ( __ ) =  ౦

( __ ) ( ౦ ) =   ౦

( ౦ ) ( __ ) =  ౦

( __ ) ( ౦ ) =   ౦


దౌహితృ పంక్తి  తరువాత  సాక్షి  పంక్తిలోని  నాలుగో  ఖానాలోని  మూర్తుల  కోసం  మళ్లీ  గుణకారం  చేసి  తెలుసుకోవాలి.  తొమ్మిది  X పది  =  పదమూడు, పదకొండు X పన్నెండు = పదునాలుగు వస్తాయి. మళ్లీ పదమూడు X పదునాలుగు =  పదిహేను,   పదిహేను X ఒకటి  =  పదహారు  ఖానాలలోని  మూర్తులు వస్తాయి. వీటిని కూడా  తయారు చేసి  చూద్దాం !
 

16 ( 15 ఇంటూ 1 ) 15 ( 13 ఇంటూ 14 ) 14 ( 11 ఇంటూ 12  ) 13 ( 9 ఇంటూ 10 )

( ౦ ) ( __ ) =  ౦

( __ ) (  __ ) = __

( ౦ ) ( __ ) =  ౦

( __ ) (  __ ) = __

( __ ) (  __ ) = __

( __ ) (  __ ) = __

( __ ) (  __ ) = __

( ౦ ) ( ౦ ) =     ___

( ౦ ) ( ౦ )  =  __

( ౦ ) ( ౦ )  =  __

( ౦ ) ( ౦ )  =  __

( ౦ ) ( __ ) =  ౦

( ౦ ) ( ౦ )  =  __

( ౦ ) ( ౦ )  =  __

( ౦ ) ( ౦ )  =  __

( ౦ ) ( __ ) =  ౦


ఈ  విధంగా  పదహారు  ఖానాల  అందమైన  ప్రస్తారం  తయారయింది.  ఈ  ప్రస్తారాన్ని  నిర్ణీతమైన  పధ్ధతిలో  వేసి  ప్రశ్న  ఫలితాన్ని  తెలుసుకోవాలి.  ప్రస్తారం లోని  ఖానాలలో నాలుగు  భూతాలు  తమ  తమ  ప్రభావాన్ని  చూపిస్తాయి.  అవి వరుసగా  1 .అగ్ని,  2.వాయువు,  3.జల,  4.పృథ్వి  భూతాలు  పరిపాలిస్తాయి..


ఒకటవ  ఖానా  అగ్ని, రెండవ  ఖానా  వాయువు,  మూడవ  ఖానా  జలము,  నాల్గవ  ఖానా  పృథ్వి  కాగా  తిరిగి  అయిదవ  ఖానా  అగ్ని, ఆరవ  ఖానా  వాయువు, ఏడవ  ఖానా  జలము, ఎనిమిదవ  ఖానా  పృథ్వి  అవుతాయి. మరల తొమ్మిదవ ఖానా  అగ్ని,పదవ  ఖానా  వాయువు, పదకొండవ  ఖానా  జలము,పన్నెండవ  ఖానా  పృథ్వి  తత్వాలు  అవుతాయి. పదమూడవ ఖానా  అగ్ని,పదునాలుగవ   ఖానా  వాయువు, పదిహేనవ  ఖానా  జలము, పదహారవ  ఖానా  పృథ్వి  తత్వాలు  అవుతాయి.  ఆకాశ తత్వము  పృఛ్ఛకుని మనస్సు  లోనే ఉంటుంది. ఇప్పుడు తయారయిన  ప్రస్తారాన్ని/ జాయచాన్ని  చూడండి.జాయచం

 

 

కొసమెరుపు : ఈ ప్రస్తారం సంతాన ప్రశ్నకోసం తయారు  చెయ్యబడింది. మన  సాంప్రదాయ  జాతక  చక్రాలలో  లాగే , ప్రస్తారం లోని  తొలి  పన్నెండు   ఖానాలు  పన్నెండు  భావాలకి , ప్రాతినిద్యం  వహిస్తాయి. అంటే  తొలి  ఖానా  ప్రశ్నకర్తని, రెండవది  అతని  ధనాన్ని,  మూడవది సహోదరులనీ, నాల్గవది విద్యని,  అయిదవది  సంతానాన్ని, ఆరవది  శతృ  రోగ  ఋణ  సంబంధాలనీ,  ఏడవది  వివాహాన్నీ,  ఎనిమిదవది ఆయువు  ఆకస్మిక  ఆపదలనీ,  తొమ్మిదవది  అదృష్టాన్నీ,  పదవది  ఉద్యోగాన్నీ, పదకొండవది  లాభాన్నీ,  పన్నెండవది   నష్టాలనీ  తెలియజేస్తాయి. ప్రశ్న సంతానానికి  సంబంధించినది  కాబట్టి  తొలి  ఖానానీ, అయిదవ  ఖానానీ , భార్యకి  సంబంధించిన  ఖానా  ఏడవ దానిని,  ఆరవ  ఖానాని  (సంతానం  కూడా  ఋణానుబంధమే  కదా ! ) సంప్రదించాలి.


ఒకటి  ఇంటూ  అయిదుతో  ఒక  షకల్ని  , ఆరు ఇంటూ   ఏడుతో  మరొక  షకల్నీ తయారు  చేయాలి.  తిరిగి  ఈ  రెండు  షకళ్ళనీ  గుణించి  చివరగా  మిగిలిన  షకల్తో  సమాధానం  చెప్పాలి/


ఈ  నియమం  ప్రకారం  (  1*5 ) =   ( బిందు * బిందు ) తొలి  వరస ! రెండవ  వరసలో  ( రేఖ  * రేఖ ),  మూడవ  వరసలో (  బిందు * బిందు ), చివరి  వరసలో  (రేఖ * రేఖ )  వెరసి   ( బిందు, రేఖ, రేఖ, రేఖ )  అయ్యాయి.  అలాగే  ( 6*7 ) =  ( రేఖ* బిందు ), (బిందు * రేఖ ) , (రేఖ * బిందు ), ( రేఖ * బిందు )  వెరసి ( బిందు, బిందు, బిందు, బిందు ) అయ్యాయి,  ఇప్పుడు  ఈ  రెండీంటినీ  గుణకారిస్తే  ( రేఖ , బిందు, బిందు , బిందు ) అంటే  'అతవే  దాఖిల్ ' వచ్చింది. ఇది   దాఖిల్ షకల్  కాబట్టి,  దాఖిల్  అన్న  శబ్దానికి  అర్థం  ప్రత్యక్షమవడం  కాబట్టి,  ప్రశ్నకర్తకి  సంతానం  కలుగుతుందని  చెప్పడమయింది.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.