అక్టోబరు బ్లాగుల విశేషాలు

-చదువరి

తెలుగు బ్లాగుల్లో వ్యాఖ్యల విప్లవం వస్తున్నట్టుంది. “అబ్బో.. నలభై యాభై దాటి వ్యాఖ్యలు వచ్చేస్తున్నాయం”టూ మేం ఆశ్చర్యపడిపోయి నిండా రెణ్ణెల్లు కాలేదు, ఇప్పుడవి వందకు చేరాయి. మనసులోమాట సుజాత రాసిన మీ చదువులు మా చావులు టపాకు వ్యాఖ్యలు వందకు చేరిన సందర్భంగా తెలుగు బ్లాగులు ఒక మైలురాయిని చేరుకున్నాయి.

తెలుగు మాధ్యమాలు బ్లాగులపై దృష్టి సారించాయి. బ్లాగులంటే ఏమిటో, ఎలా రాయాలో చెప్పే వ్యాసాలతో పాటు, వారం వారం ఒక బ్లాగును పరిచయం చేసే వ్యాసాలూ వస్తున్నాయి. వీటి ప్రభావం కూడలిలోనూ, బ్లాగు పాఠకుల సంఖ్యలోనూ తెలుస్తోంది. బ్లాగులు నిదానంగా జాలజనజీవనస్రవంతి లోకి జొరబడుతున్న సూచనలు కనబడుతున్నాయి.

రాజకీయాలు, చర్చలు
అక్టోబరు రాజకీయ బ్లాగులు మతము, మతఘర్షణల చుట్టూ ఎక్కువగా తిరిగాయి. చర్చలు కూడా ఎక్కువగా రాజకీయ బ్లాగుల్లోనే జరిగాయి. ఒరిస్సాలో జరిగిన హింసాకాండ నేపథ్యంలో మతమార్పిడులను చదువరి రక్తపాత రహిత కుట్రగా వర్ణించారు. అక్కడ జరిగిన చర్చ మహేష్ పర్ణశాలలో రాసిన టపాలో కొనసాగింది. అసలు వీటికి మూలం నాగప్రసాద్ రాసిన మీరు దేవుణ్ణి తింటారా అనే టపా! ఈ లోగా వాసిలి సురేష్ ఒరిస్సాలో జరిగిన దాడులకు మూలాలను వెతికారు. ఇదిలా ఉండగా అబ్రకదబ్ర అభి-మతం అనే టపాలో తన అబిప్రాయం రాసారు. క్రైస్తవం గురించి జాన్ హైడ్ కొన్ని టపాలు వేసారు. రామాయణం మీద వస్తూ ఉన్న టపాల వరుసలో మరొక టపా దుర్గేశ్వర రాసారు. ఇతర టపాల లాగానే ఇది కూడా చర్చకు వేదికయింది.

జ్ఞానపీఠానికి తెలుగువారిలో అర్హులెవ్వరు అంటూ ఒక చర్చ జరిగిందీ నెల. పూలదండను పట్టుకుని చంద్రమోహన్ జ్ఞానపీఠార్హులెవరంటూ వెదకబోయారు. కొత్తపాళీ కూడా ఈ పీటముడిని విప్ప ప్రయత్నించారు. త్రివిక్రమ్ అందుకుని జ్ఞానపీఠపు మర్మాన్ని కనుగొన ప్రయత్నించారు.

సాహిత్యం, సంగీతం

స్వగతాలు, స్వ గతాలు

సినిమా

హాస్యం, వ్యంగ్యం

ఇంద్రధనుస్సు

  • తిండి మీద దృష్టి సారించారు బ్లాగరులు. పప్పును మించిన పాకము కలదా అంటూ పప్పుసుద్ద శ్రేష్టత గురించి మాకినేని ప్రదీప్ రాస్తే, పప్పుల్లో మహాపప్పు కందిపప్పు అంటూ వ్యాఖ్యాతలు రాసారు.
  • వాసన పట్టేసిన భాస్కరరామరాజు ముద్దపప్పు గురించి ఓ టపా వేసారు. వివిధ రకాలైన పప్పులను తయారుచేసే ప్రోగ్రాములను అందరికీ అర్థమయ్యే రీతిలో రాసారు కూడా.
  • బాపు అనగానే రమణ గుర్తొచ్చినట్టు, పప్పనగానే ఆవకాయ గుర్తుకు రావడం ఆంధ్రుడి లక్షణం. తల్లక్షణ ఫలితమే విరజాజి పూయించిన ఆవకాయ పురాణం టపా!ఈ విధంగా పప్పావకాయతో అక్టోబరు బ్లాగులు రుచులూరిపోయాయి.
  • భోజనాలకి పిలిచి వేళకి భోజనం పెట్టకపోతే కలిగే బాధను తాడేపల్లి తన ఆఱు నూఱైనా…. లో వివరించారు.
  • గార్లపాటి ప్రవీణ్ ఓ సాయంత్రం – ఆఫీసు నుంచి ఇంటికి … అంటూ తన ఆలోచనాస్రవంతిని బ్లాగులో ప్రవహింపజేసాడు.
  • వివిధ బ్లాగులు, బ్లాగరుల పేర్లను స్పృశిస్తూ, గతంలో కొల్లూరి సోమశంకర్ పొద్దులో ఒక లేఖ రాసారు. ఇప్పుడు వివిధ బ్లాగరులను పలకరిస్తూ లీలామోహనంలో ఒక జాబు వచ్చింది. బ్లాగు పేర్లకు తగిన బొమ్మలు పెట్టడం ఈ టపా ప్రత్యేకత.
  • కురులను సంరక్షించుకోవటం ఎలా అనే విషయంపై శ్రీసత్య వరసగా టపాలు వేస్తున్నారు. వాటిలో ఈమధ్య వచ్చిన టపా ఇది.
  • నేను హార్లిక్సు తాగను, తింటాను అన్నట్టు, టీవీలో యాడ్లే చూస్తాను అంటూ చెబుతున్నారు పసిగుడ్డు.
  • శివుడాజ్ఞ అంటూ నిడదవోలు మాలతి ఒక కథ రాసారు. విశిష్టత ఏంటంటే.. రెండు ముగింపులను ఇచ్చి ఏది నచ్చిందో చెప్పండని పాఠకులను అడగడం.
  • భయం భయం అంటూ లచ్చిమి రాసిన టపా ఆకట్టుకుంది. తన అసలు పేరు రష్మి (చిన్నపిల్ల కావడంతో ర ను ‘ల’ గానూ, ‘ష్మి’ని ‘చ్చిమి’గానూ పలుకుతున్నదని అనిపిస్తోంది) అని ఎప్పటికి చెప్పగలుగుతుందో.
  • మహాత్ముడి పుట్టినరోజు మాటున మరుగునపడిపోయిన లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజును మననం చేసుకున్నారు సురేష్.
  • పొద్దులో ప్రచురింపబడి ప్రాచుర్యం పొందిన కైవల్యం కవితపై తన అభిప్రాయాన్ని రాసారు అరుణాంక్

కొత్త బ్లాగులు

ప్రత్యేక ప్రస్తావన
సుప్రసిద్ధులైన తెలుగువారి గురించి మనకు తెలీని ఎన్నో విషయాలను చెబుతూ సాగిపోయే బ్లాగు తెలుగురథం. మనకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిన మహామహుల జీవితాల గురించి, ప్రసిద్ధ సంఘటనల గురించి, పండుగల గురించి ఈ బ్లాగులో టపాలు వస్తూంటాయి. సందర్భోచితంగా – మహానుభావుల జయంతి లేదా వర్ధంతి రోజునగానీ, పండుగల రోజునగానీ, సంఘటనల వార్షికానగానీ – వ్యాసాలను వెలువరించడం ఈ బ్లాగు ప్రత్యేకత. పాత వ్యాసాలను చదువుకునేందుకు వీలుగా నెలవారీగా టపాలకు లింకులు ఇస్తే బాగుంటుంది.

తెలుగురథం చోదకులు కొంపెల్ల శర్మకు అభినందనలు

————————————-

చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.

This entry was posted in జాలవీక్షణం and tagged , , . Bookmark the permalink.

23 Responses to అక్టోబరు బ్లాగుల విశేషాలు

Comments are closed.