జూలైలో తెలుగు బ్లాగుల విశేషాలు

-సిముర్గ్, వీవెన్, చదువరి

వెల్లువెత్తిన వ్యాఖ్యలు
ఈ నెల బ్లాగుల్లో వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. మామూలుగా జాబుకు పది పదిహేను వ్యాఖ్యలు ఉంటే బాగా ఉన్నట్టే! అలాంటిది, ముప్పై నలభై యాభై వ్యాఖ్యలు కూడా అందుకున్నాయి.

మీనాక్షి రాసిన నేను ఎందుకు ప్రేమించలేదంటే…..??? కు 51 వ్యాఖ్యలు వచ్చాయి. ఆమే రాసిన పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా..!!!.( సినిమా..) కు 40 కి పైగా వ్యాఖ్యలు వచ్చాయి.
సుజాత రాసిన నా జర్నలిస్టు ఉద్యోగం పరంపరకు మంచి స్పందన వచ్చింది. మొదటి భాగానికి 49 వ్యాఖ్యలు వచ్చాయి.
కత్తి మహేశ్ కుమార్ రాసిన కట్నానికి మరో వైపుకు 54 వ్యాఖ్యలు వచ్చాయి.

బ్లాగు వివాదాలు

జూలైలో బ్లాగుల్లో రేగిన వివాదాలు కొందరు బ్లాగరులకు కలత కలిగించాయి. కులం, మతం, బ్లాగు మర్యాద మొదలైనవాటిపై వివాదాస్పద జాబులు, వ్యాఖ్యలు కలకలం కలిగించాయి. ముందుగా.. కుల ఘర్షణల సమస్యపై తెగేదాకా లాగడం వరసలో తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం రాసిన నాలుగో జాబులో గట్టి చర్చే జరిగింది. ఈ విషయంపైనే కత్తి మహేష్ కుమార్ ఒక మెతుకు పట్టుకునిచూస్తే చాలా !?! అనే జాబు రాసారు.

కలగూరగంపలో జరిగిన ఆ చర్చల హోరు మతం గురించి రాస్తున్న మరో బ్లాగులో ప్రతిధ్వనించాయి. ఈ బ్లాగులో వివిధ మతాల ఆచారాలను పోలుస్తూ రాసిన జాబులు మరో కొత్త బ్లాగు సృష్టికి అంకురార్పణ చేసి ఆ రెండు బ్లాగుల మధ్య ఒక చిన్న బ్లాగు యుద్ధానికి దారి తీసాయి. ఆ తరువాత ఆ రెండు బ్లాగులనూ మూసివేయడంతో ఆ వివాదం సమసిపోయింది.

బ్లాగు మర్యాదలపై చెలరేగిన వివాదం తీవ్రమైన చర్చకు దారితీసింది. కూడలి కబుర్ల గదిలో కొత్తా పాతా బ్లాగరులు సమావేశమై చర్చ కూడా జరిపారు. బ్లాగరులు తమ జాబులను పదే పదే తాజాకరించడంతో కూడలిలో ఎల్లప్పుడూ పైనే ఉంటూ వచ్చిన వైనంపై తెలుగుబ్లాగు గూగుల్ గుంపులో జరిగిన చర్చతో వివాదం మొదలైంది. బ్లాగింగులో రాగింగు అంటూ సరస్వతీకుమార్ ఒక జాబు రాసారు. ఆదివారం నాడు కూడలి కబుర్లలో చర్చ కూడా జరిగింది. ఈలోగా.. టపాలు ఎన్ని రాయాలో, ఎలా రాయాలో కూడా మీరే చెప్పేస్తారాండీ అంటూ తెలుగువాడిని ఓ జాబు రాసారు. ఆ తరువాత రెండు రోజులకే వీవెన్ కూడలిలో తగుమార్పులు చెయ్యడంతో సమస్య పరిష్కారమైంది. దీనికి తోడు బ్లాగర్ల హక్కులేమిటి అంటూ కల్పనా రెంటాల రాసిన జాబులో కూడా చర్చ జరిగింది.

చర్చలు

రాజకీయాలు / సామాజికం

జ్ఞాపకాలు / ‘స్వ’గతాలు

హాస్యం / వ్యంగ్యం

ఇతరత్రా

బ్లాగుల గురించి

కొత్త బ్లాగులు


ఈ నెల జాబులు:

  • చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం బ్లాగరుల అభిమాన విషయం. చదువరుల గుండెలను తాకి, వారిని తన భావోద్వేగంలో లీనం చేసేసుకోగలగడం కొన్ని జాబుల ప్రత్యేకత. అలాంటి జాబు – శిలాక్షరాలైన క్షణాలు- 2. ఇది మా ఈనెల జాబుల్లో ఒకటి. ఇది రెండు జాబుల వరసలో రెండోది. మొదటి జాబు చదివి ఈ జాబుల నేపథ్యాన్ని తెలిసికొన్న తరవాత ఈ రెండో జాబు చదవండి.
  • అణుఒప్పందం గురించి సవివరంగా విశ్లేషించిన జాబు ఇది. ఒక పరిశోధనాపత్రం లాగా, తగు మూలాలను, అకరాలను ఉదహరిస్తూ పప్పు నాగరాజు రాసిన ఈ జాబు మా ఈనెల జాబుల్లో ఒకటి.

హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారి బ్లాగు చూస్తున్నారా? తాము ప్రచురించిన పుస్తకాల గురించి వారీ బ్లాగు రాస్తున్నారు. మన మంచి పుస్తకాలు అంటూ రాసిన జాబులో, తమ పుస్తకాలను పాఠకులెలా తెప్పించుకోవచ్చో వ్యాఖ్యల్లో రాసారు. ప్రస్తుతం ఆన్‌లైనులో అమ్మే సౌకర్యం వారింకా ఏర్పాటు చేసుకోలేదు. ఎవరైనా సాంకేతిక సాయం చేస్తే వారు అందుకు సుముఖంగానే ఉన్నట్టున్నారు.

జల్లెడ వారు ఉత్తమ తెలుగు బ్లాగు టపాల పోటీ పెట్టారు చూసారా? మీరు పాల్గొంటున్నారా?

ఆది బ్లాగరిగా మన్ననలందిన చావా కిరణ్, తన బ్లాగును మూసేసి, బ్లాగు సెలవు పుచ్చుకున్నారు. ఒక అధ్యాయం ముగిసింది.

——————–

జూలైలో బ్లాగు మొదలుపెట్టి ఏకంగా 47 జాబులు రాసి పారేసిన ఓ బ్లాగరి గురించి చెబుదామనుకున్నాం. అయితే వారు రాయడం సంగతేమోగానీ, ఇతర బ్లాగుల్లోంచి జాబుల్ని కొట్టెయ్యడంలో మాత్రం సిద్ధహస్తులని తెలిసాక, ఆ బ్లాగుకు ఈ ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాం. వారి కళావైశిష్ట్యానికి మచ్చుతునకగా కింది లింకులను చూడండి. ఇలాంటివి ఆ బ్లాగులో మరిన్ని ఉన్నాయని తెలుస్తోంది. మీకు తెలిసినవి కూడా రాస్తే నికరంగా వారి స్వంత రచనలేవో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

  • వారి బ్లాగులోని ముక్క:http://aradhanaa.blogspot.com/2008/07/blog-post_8862.html
  • మూలం: http://vinnakanna.blogspot.com/2008/07/blog-post.html

———————-

-సిముర్గ్, వీవెన్, చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యులు

This entry was posted in జాలవీక్షణం and tagged , , . Bookmark the permalink.

15 Responses to జూలైలో తెలుగు బ్లాగుల విశేషాలు

Comments are closed.