స్వాతి: ఈ మధ్యకాలంలో కొందరు పద్యానికి కాలం చెల్లింది అంటుంటే బాధగా అనిపిస్తుంది
సుబ్రహ్మణ్యం: పద్యానికీ, కవిత్వానికీ కాలం చెల్లడం అనేది ఉండదు..
స్వాతి: నిజం, రూపాంతరం చెందటం అనేది అతి సహజమైన విషయం. భాషలో, భావ వ్యక్తీకరణలో వచన కవిత వల్ల అభిలషించదగ్గ మార్పులే వచ్చాయి
సుబ్రహ్మణ్యం: యుగ యుగానికీ కవితా స్వభావం మారుతుంది అని తిలక్ అంటాడు వచన కవిత వల్ల చాలా నష్టాలు కూడా వచ్చాయి.
స్వాతి: కాని మరో వైపు ఈ స్వేచ్ఛని దుర్వినియోగ పరుస్తూ మామూలు మాటల్నే కవితలుగా చెలామణీ చేస్తున్నారు కొందరు.
సుబ్రహ్మణ్యం: కవిత్వానికి ప్రాణాలైన అక్షర మైత్రి, పదాల పొందిక, లయ ఇవేవీ లేకుండా శుద్ధ వచనం రాసేస్తున్నారు.
స్వాతి: ఇంకొందరు వింత ప్రయోగాలతో సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు.
సుబ్రహ్మణ్యం: 🙂
స్వాతి: ప్రయోగాలు మంచివే కానీ అసలు అర్ధమూ ఆంతర్యమూ లేని కవిత్వాన్ని చూసి పాఠకులకి కవిత్వమంటే కామెడీగా అవుతుంది
సుబ్రహ్మణ్యం: నూతనత్వం కవిత్వ ధర్మం, ఐతే “అరటిపండు ఒలిచిపెట్టే” ధోరణి కవిత్వంలో మంచిది కాదు.
స్వాతి: అదసలు కవిత్వమే అవ్వదేమో.
సుబ్రహ్మణ్యం: పాఠకుడు కూడా కొంత కృషి చెయ్యాలి కవిత్వ భాషని అర్ధం చేసుకునేందుకు ఏ మాత్రం కృషి చెయ్యకుండా కవిత్వం పూర్తిగా అర్ధమైపోవాలి అనే సోమరి పాఠకుల జాబితాలోకి చేరిపోకూడదు.
స్వాతి: ఊ, అసలా మేథో మథనం ఉంటేనే కదా కవికైనా పాఠకుడికైనా రసాస్వాదన
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: ఈ మధ్య కొత్త ప్రక్రియల్లో ఒకలైనూ అర లైనూ కవితలొస్తున్నాయి. అవి మీకెలా అనిపిస్తాయి.
సుబ్రహ్మణ్యం: దీనికి కొంచెం పెద్ద సమాధానం ఇవ్వాలి..
స్వాతి: ఇవ్వండి.
సుబ్రహ్మణ్యం: ఒక లైను, అర లైను కవిత్వాలు అన్నారు కదా.. ముందుగా మూడు లైన్ల హైకూ రూపం గురించి మాట్లాడాలి.. కింది లంకె లోని కవిత చదవండి.. http://etiodduna.blogspot.com/2008/03/blog-post_27.html గమనించండి.. ఈ కవితలో సెలయేటి సవ్వడి చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని భంగ పరచకుండా, రెట్టింపు చేస్తోంది. జెన్ బౌద్ధం ప్రకారం కవిత్వం యొక్క పరమావధి కూడా అదే! మనిషిని మౌనంవైపు నడిపించడం. కవిత్వం భాషాతీతంగా ఉంటుందని జపనీయులు నమ్ముతారు. తెలుగులో ఈ రకమైన కవిత్వానికి ఆద్యుడైన ఇస్మాయిల్ గారు ఈ నిశ్శబ్ద కవిత్వం గురించి ఎన్నో మంచి వ్యాసాలు, పుస్తకాలు రాసారు. కాబట్టి జపనీయుల హైకూకి బలమైన తాత్విక భూమిక ఉంది. కింది వ్యాసంలో నేను ఈ విషయాన్ని మరింత విస్తారంగా చర్చించాను.http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=47645&page=1 ఐతే హైకూ యొక్క మూలాల్ని అర్ధం చేసుకోలేక చాలా మంది తెలుగు కవులు హైకూ పేరిట చెత్తంతా రాస్తున్నారు. ఇక మినీ కవితలు, నానీలు – వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీళ్ళంతా గుర్తుంచుంకోవల్సింది ఏంటంటే చమత్కారం ఎప్పటికీ కవిత్వం కాదు. క్లుప్తత కవిత్వానికి ముఖ్య లక్షణం అయినప్పిటికీ కేవలం నాలుగు లైన్ల చమత్కార పూరిత రచన కవిత అయిపోదు కదా!
స్వాతి: మీరు పంపిన వ్యాసం చదివాను. మీరు రాశారా హైకూ లు?
సుబ్రహ్మణ్యం: I wrote few hai-kus those are there in my blog with name “చిరుజల్లులో పూలు”
స్వాతి: కొన్ని చదివినట్టు గుర్తు
సుబ్రహ్మణ్యం: ok
స్వాతి: పైన లింక్ లోని వ్యాసంలో మీరన్నట్టు హైకూని కవిత అనే కన్నా పద చిత్రం అనటం సమంజసం.
సుబ్రహ్మణ్యం: పదచిత్రాన్ని English లో image అంటారు… imagism was a big movement in English poetry,.. Ezra Pound was the founder of imagist poetry in English. కవిత్వంలో నిశ్శబ్దం… వ్యాసం చదవండి. Ismail wrote it.
స్వాతి: ఆహా, నాకెప్పట్నుండో ఒక సందేహం
సుబ్రహ్మణ్యం: చెప్పండి
స్వాతి: కొందరు కవులు ఒక వాక్యాన్ని నాలుగైదు పాదాలుగా ఒక్కో పాదాన్ని ఒక్కో లైన్ లో రాస్తూ ఉంటారెందుకు.
సుబ్రహ్మణ్యం: దీనికి సరైన సమాధానం చెప్పలేను గానీ..
స్వాతి: నా ప్రశ్న మీకర్థమైందా?
సుబ్రహ్మణ్యం: yeah, అర్థమైంది.. నేనైతే అక్షర మైత్రి.. లయ.. ఇవి చూస్తా.. ఉదాహరణకి “నిజాన్ని అద్దంలోంచి చూస్తూ అబద్ధంలో హాయిగా తిరిగేస్తున్నాం” ఇలా అనే కంటే “అద్దంలోంచి నిజాన్ని చూస్తూ అబద్ధంలో హాయిగా తిరిగేస్తున్నాం”
స్వాతి: రెండవ దాన్లో లయ బాగుంది
సుబ్రహ్మణ్యం: అబద్ధంలో తిరిగేస్తున్నాం అంటే ఇంకా బావుంటుంది
స్వాతి: ఇది అమోదయోగ్యం కానీ దీన్నే కొందరైతే “అద్దం లోంచి నిజాన్ని చూస్తూ”
సుబ్రహ్మణ్యం: 🙂
స్వాతి: ఈ రకంగా విరిచి తలో మూలకి విసిరేస్తారెందుకో పేజీల ఖర్చు తప్ప ఏమీ కనపడదు
సుబ్రహ్మణ్యం: అవును, చిన్న చిన్న ఖండికలుగా రాయడం వల్ల readability పెరుగుతుంది కానీ మరీ ఇంత ముక్కలు చెయ్యక్కరలేదు.
స్వాతి: అన్నట్టు ఆ మధ్య ఒక కథ రాసినట్టున్నారు. అంటే, నేను చదివింది ఒక్కటే. మీరెన్ని రాశారో మరి 🙂
సుబ్రహ్మణ్యం: ఏ కథ చదివారు?
స్వాతి: కొంచం absurd కథలా ఉంది
సుబ్రహ్మణ్యం: oh..
స్వాతి: పేరేమిటబ్బా
సుబ్రహ్మణ్యం: Telugupeople లో చదివారా?
స్వాతి: అవును, మనిషి తనలోని నిజాయితీ బరువుని మోయలేక చంపేయటం గురించి
సుబ్రహ్మణ్యం: నిశ్చల యాత్ర కౌముది కథ చూడండి.. ఇదే నా recent story… 1 yr లో ఏమీ రాయలేదు
8 Responses to ఏటి ఒడ్డున కొన్ని మాటలు – మూలా సుబ్రహ్మణ్యంతో స్వాతి కుమారి కబుర్లు