’రమల్’ ప్రశ్నశాస్త్రం – 6

‘రమల్’లో పంక్తి భేధాలు ఉన్నాయి. ఇంత వరకు మనం చూసిన మూర్తుల క్రమాన్ని, ‘శకున పంక్తి’ అంటారు. ఇది చాల ప్రధానమైన పంక్తి.  లహ్యాన్ (వాగ్మి);  కబ్జుల్ దాఖిల్ (తీక్ష్ణాంశు); కబ్జుల్ ఖారీజ్ (పాత్);  జమాత్ (సౌమ్య్);  ఫరహా (దైత్యగురు); ఉకలా (మందగ్);  అంకీశ్ (సౌరి); హుమరా (లోహిత్) ; బయాజ్ (విధు); నుసృతుల్ ఖారీజ్ (ఉష్ణగు); నుసృతుల్ దాఖిల్ (సూరి); అతవే ఖారీజ్ (చక్ర); నకీ (ఆర్); అతవే దాఖిల్ (కవి); ఇజ్జతమా (బోధన్); తరీక్ (శీతాంశు). ఈ పదహారు మూర్తుల వరుస క్రమాన్నే ‘శకున పంక్తి’ అంటారు.దీనినే స్థాయీ పంక్తి అని అంటారు.


తక్కిన  పంక్తి  బేధాలు  ఈ  విధంగా  చెప్పబడ్డాయి.
1. శకున పంక్తి., 2. అ,వ,ద,హ పంకి, 3. వి,జ,ద,హ పంక్తి, 4. అ,వ,జ.ద పంక్తి, 5.  మిజాజ్  పంక్తి, 6. హరఫా పంక్తి, 7. అస్సద్ పంక్తి.


వీటిలో రెండవదైన అ,వ,ద,హ పంక్తిని  బిందు శోధన ప్రశ్న పధ్ధతిలో  చాలా  క్లిష్టమైన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చేందుకు  ఉపయోగిస్తారు. ఆధునిక కాలం లోని అన్ని ప్రశ్నలకి ఈ పంక్తిలోని మూర్తుల ద్వారా జవాబులు చెప్పవచ్చు. వి,జ,ద,హ పంక్తిని  అవధిని (ప్రశ్న ఫలింఛే కాలాన్ని) తెలుసుకొనేందుకు వినియోగిస్తారు. అ,వ,ద,జ పంక్తిని దొంగల పేర్ల లోని అక్షరాలు, పట్నాలలోని అక్షరాలు, వగైరా తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. మిజాజ్ పంక్తిని సూర్యాది  గ్రహాలకి  ప్రాతినిధ్యం  వహించే  మూర్తుల క్రమంలో పేర్చి, వాటి శుభాశుభ దృష్టులని  తెలుసుకొనేందుకు వినియోగిస్తారు. చివరి  రెండు పంక్తుల ఉపయోగం రమలఙ్ఞుల అనుభవం మీద ఆధార పడుతుంది.


ఈ పంక్తుల లోని మూర్తుల క్రమం దిగువ నిచ్చిన  పట్టిక ఆధారంగా   తెలుసుకోవచ్చు.
 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
1 శకున

పంక్తి

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
2 అవ

దహ

పంక్తి

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
3 విజ

దహ

పంక్తి

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
4 అవ

జద

పంక్తి

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
5 మి

జా

జ్

పంక్తి

_

_

_

__

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

__

__

__

__

__

__

__

__

__

 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
6

రఫా

పంక్తి

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
7 అస్స

ద్

పంక్తి

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__


పదహారు మూర్తులను ఏడు విభిన్న రకాల  పంక్తులలో  పేర్చి ‘రమల్ ’శాస్త్రఙ్ఞులు, ప్రశ్న శాస్తాన్ని కూలంకషంగా విశదీకరించారు.


అ,వ,ద,హ పంక్తి: ఇది చాలా ముఖ్యమైన పంక్తి. దీనిలోని మూర్తుల క్రమం తత్వాలని బట్టి వర్గీకరించ బడింది. రమల్ లోని తత్వాలుముఖ్యంగా నాలుగని చెప్పుకొన్నాం కదా ! అవి వరుసగా, 1.అగ్ని, 2 వాయు, 3 జల, 4 పృథ్వి. ఈ తత్వాలలో  ప్రకటితమైనవి కొన్ని, గుప్తమైనవి కొన్నీ ఉంటాయి. బిందువుని ప్రకటితమైనదని, రేఖని గుప్తమైనదనీ అంటారు. ఈ విద్యలోని అసలైన మూర్తి, శీతాంశు అంటే  నాలుగు బిందువులు ఒకదాని క్రింద మరొకటి నిలువుగా వ్రాస్తే వచ్చేది. ఇందులో అన్ని తత్వాలూ ప్రకటితమైనవే! అగ్నితత్వానికి ఒక అంశ, వాయుతత్వానికి రెండు అంశలు , జలతత్వానికి నాలుగు అంశలు, పృథ్వితత్వానికి ఎనిమిది అంశలు ఇవ్వడం జరిగింది. ఈ అంశల లెక్క ప్రకారమే అవదహ పంక్తి లోని మూర్తుల క్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఇది ఎలాగయిందో పరిశీలిద్దాం !


అవదహ లోని మెదటి మూర్తి, లహ్యాన్ లేదా వాగ్మి దీనిలోని మెదటి వరసలో బిందువు ఉంది  అంటే అగ్ని తత్వం తెరచుకొని ఉంది. అంటే ఒక అంశ తప్ప తక్కిన తత్వాలన్నీ మూసుకొనే ఉన్నాయి కదా? ఇక రెండవ వరసలో మూర్తి హుమరా లేదా లోహిత్, అంటే (రేఖ, బిందువు, రేఖ, రేఖ ) ఈ హుమరాలో రెండవ వరుసలో బిందువు ఉండడం వల్ల, రెండు అంశలు అంటే వాయుతత్వం తెరచుకొని ఉంది కదా ! ఇక మూడవ వరసలోని మూర్తి నుస్రుతుల్ ఖారీజ్ లేదా ఉష్ణగు (బిందువు, బిందువు, రేఖ, రేఖ) దీనిలో మొదటి బిందువుకి ఒక అంశ, రెండవ బిందువుకి  రెండు అంశలు అంటే మొత్తం మూడు అంశలు వచ్చాయి, కనుక ఇది మూడవ మూర్తి అయింది! అలాగే  నాలుగవ మూర్తి బయాజ్ లేదా విధు (రేఖ , రేఖ, బిందువు, రేఖ) అంటే నాలుగు అంశలు, జలతత్వం తెరచుకొని ఉంది. ఇదే విధంగా పదిహేనవ మూర్తి శీతాంశు, లేదా తరీఖ్ (బిందు, బిందు, బిందు, బిందు) అంటే 1+ 2+ 8 = 15 అంశలు అయ్యాయి.ఆఖరి మూర్తి జమాత్ లేదా సౌమ్య (రేఖ, రేఖ, రేఖ, రేఖ) దీనిలో  ఏ తత్వమూ తెరచుకొని లేదు గనుక అంశలు లేవు. అందుకే ఇది ఆఖరి మూర్తి  అయింది. ఈ పంక్తి లోనే మూర్తుల గురించి సందర్భం వచ్చినప్పుడు వివరంగా చర్చించు కోవచ్చు. అలాగే తక్కిన పంక్తుల  వివరాలు కూడా సమయాన్ని బట్టి  చర్చించుకొందాం !


ఇక ప్రశ్న విషయానికి వద్దాం. ప్రశ్నని రమలఙ్ఞులు ఇలా విశదీకరించారు. 1. ప్రశ్న కర్త యొక్క మనసు లోని అభిప్రాయం. 2 దానికి కారణం 3. ప్రశ్న భేధము 4. కార్య సిధ్ధి లేదా అసిధ్ధి.


శకున పంక్తి లోని ఒకటి, నాలుగు , ఏడు, పది ఖానాలని కేంద్రాలని అంటారు.వీటికి సాక్షి క్రింద  ప్రస్తారం లోని సాక్షి పంక్తి లోని  పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు ఖానాలని పిలుస్తారు.వీటిని క్రమానుసారంగా గుణించి నాలుగు మూర్తులని తయారు చేసుకోవాలి.


ఇలా వచ్చిన నాలుగు షకల్ లలో మొదటి మూడింటిని , శకున పంక్తి లోని  మూర్తుల  ప్రకారం శుభా శుభ ఫలితాలు తెలుస్తాయి. అంటే మొదటి షకల్ ద్వారా ప్రశ్నకర్త అభిప్రాయం, రెండవ షకల్ ద్వారా కారణం, మూడవ షకల్ ద్వారా ప్రశ్న భేధము తెలుసుకోవాలి. ఈ మూడు మూర్తుల లోని  శుభా శుభ స్వభావాన్ని బట్టి  ఫలితం చెప్పాలి. ఇక నాలుగవ  షకల్ ని  సహాయక  ఉపకరణంగా వాడుకోవాలి.


దీనిని మనం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం. (ప్రశ్న కర్త అభిప్రాయం తెలుసుకోవడం ఏమిటి అని సందేహం కలుగ వచ్చు. ఈ అబిప్రాయ సాధన మూక ప్రశ్నలలో అవసరం అవుతుంది.అంతే కాదు, ప్రశ్న కర్త నిజంగానే ఆ ప్రశ్నని అడుగుతున్నాడా, లేక తమాషాకి అడుగుతున్నాడా అనే విషయం కూడ తెలుసుకోవచ్చు)


ఒక పృచ్చకుడు వచ్చి, "హే రమలఙ్ఞ్ ! మీరు నా మనసు లోని అభిప్రాయము, కారణము, భేధము, సిధ్ధి అసిధ్ధి ఫలము చెప్పండి"  అని అడిగాడనుకొందాం. అతనిచ్చిన మాతృ పంక్తి  (ఉమాహంత్) లోని షకల్లు వరుసగా, ఫరహా, జమాత్, మూడు నాలుగు స్థానాలలో కబ్జుల్ ఖారీజ్ ఉన్నాయి. దీనిని బట్టి ప్రస్తార్ లేదా జాయచా వేసాం. అది ఇలా ఉంది.

ఈ విధంగా తయారయిన  ప్రస్తారాన్ని గమనించారు కదా ! దీని ద్వారా పృఛ్చకుని అభిప్రాయాన్ని తెలుసుకొందాం !

అభిప్రాయాన్ని తెలుసు కొనేందుకు, శకున పంక్తిలోని మొదటి ఖానాలోని లహ్యాన్ని, ప్రస్తారం లోని పదమూడవ ఖానా లోని ఫరహాని  గుణకారిస్తే (బిందు, రేఖ, రేఖ, రేఖ ) ( బిందు, బిందు, రేఖ, బిందు ) =  (కబ్జుల్ దాఖిల్ ) = (రేఖ, బిందు, రేఖ, బిందు ) వచ్చింది.


ఇప్పుడు ప్రస్తారం లోని మొదటి ఖానా లోని ఫరహాని, దాని సాక్షి రూపం లోని పంచమ ఖానా లోని ( ప్రస్తారంలో ) నకీని గుణకారిస్తే ఇజ్జతమా.( బిందు, బిందు, రేఖ, బిందు ) ( బిందు, రేఖ, బిందు, బిందు ) = ( రేఖ, బిందు, బిందు ,రేఖ ) వచ్చింది. ఈ విధంగా  రెండవ షకల్ వచ్చింది.

ఇప్పుడు ముందు వచ్చిన మొదటి షకల్ని,( ( రేఖ, బిందు, రేఖ, బిందు ) రెండవ షకల్ని ( రేఖ, బిందు, రేఖ, బిందు ) గుణకారిస్తే నుశ్రుతుల్ దాఖిల్ ( రేఖ, రేఖ, బిందు , బిందు ) వచ్చింది. ఈ నుసృతుల్ దాఖిల్ , శకున పంక్తిలో పదకొండవ స్థానంలో  ఉంది. అందువల్ల  ,పృఛ్చకుని అభిప్రాయాన్ని లాభం  గురించి అని తెలియ జేస్తోంది. పదకొండావ స్థానం లాభస్థానం కాబట్టి !

కారణం గురించి తెలుసుకొందాం.

శకున పంక్తిలోని  నాలుగవ స్థానం కారణ స్థానం ! అందులో  ఎప్పుడూ  ‘జమాత్’ ఉంటుంది. దాని సాక్షి ప్రస్తారం  లోని పద్నాలుగువ ఖానా , అందులో ‘లహ్యాన్’ ఉంది. వీటిని గుణకారిస్తే  తిరిగి లహ్యాన్’ వచ్చింది. అదే విధంగా ప్రస్తారంలో  నాలుగవ స్థానంలో  ‘కబ్జుల్ ఖారీజ్’ ఉంది. దానికి  సాక్షి  ప్రస్తారంలోని  ఎనిమిదవ ఖానా, అందులో ‘లహ్యాన్’  ఉంది.


ఇప్పుడు  ఈ  రెండింటినీ  గుణకారిస్తే  బయాజ్ ’ వస్తుంది. ఈ రెండింటినీ అంటే లహ్యాన్నీ, బయాజ్నీ ,గుణకారిస్తే  ‘కబ్జుల ఖారీజ్’ వచ్చింది. ఇది శకున పంక్తిలో మూడవ  స్థానంలో ఉంటుంది. అందువల్ల  మూడవ స్తానం కారణాన్ని తెలుపుతుంది. మూడవ  సోదరులు, సమీపస్థ యాత్ర లని సూచిస్తుంది. అందువల్ల పృఛ్చకుని  ప్రశ్న కారణం ఈ రెండింటిలో  ఒకటి అవుతుంది.


ప్రశ్న  భేధం గురించి తెలుసుకొందాం.

శకున పంక్తిలో ప్రశ్న భేదాన్ని  తెలిపే ఖానా  ఏడవది. అది ‘హుమరా’ ! దీని సాక్షి ప్రస్తారంలోని పదిహేనవ స్తానం, అందులో ‘కబ్జుల్ దాఖిల్’ ఉంది. ఈ రెండింటినీ గుణిస్తే ‘ అంకీశ్’ వస్తుంది. ప్రస్తారంలోని ఏడవ స్థానంలోని షకల్ ‘నుసృతుల్ దాఖిల్ ’. దీని సాక్షి  ప్రస్తారంలోని పదకొండవ ఖానా, అందులో కూడా ‘నుసృతుల్ దాఖిల్ ’.ఉంది ! వీటిని గుణిస్తే ‘జమాత్’ వస్తుంది. ఇప్పుడు మొదట వచ్చిన అంకీశ్నీ తరువాత వచ్చిన జమాత్నీ గుణిస్తే ‘అంకీశ్ ’ వచ్చింది. ఇది శకున పంక్తి లోని ఏడవ స్థానంలో ఉంటుంది అందువల్ల భార్య లేక భాగస్వామ్యము లేక దూర ప్రయాణము అని అనుకోవచ్చు. లభించిన  వాటిని బట్టి పరిశీలిస్తే  పశ్న కర్త భాగస్వామ్యం గురించిన లాభం గురించి అడుగుతున్నాడని  తెలుసుకోవచ్చు.


కార్య సిధ్ధి,లేక అసిధ్ధి

కార్య సిద్ధి  శకున పంక్తిలోని పదవ ఖానా అందులో ‘నుసృతుల్ ఖారీజ్’ ఉంటుంది. దాని సాక్షి ప్రస్తారంలోని పద్నాలుగవ ఖానాలోని  ‘లహ్యాన్ ’ వీటిని గుణిస్తే ‘హుమరా ’ వచ్చింది. ప్రస్తారంలోని పదవ స్థానంలో ‘జమాత్’ ఉంది దాని సాక్షి ప్రస్తారంలోని పద్నాలుగవ ఖానా లోని లహ్యాన్ వీటిని గుణిస్తే తిరిగి లహ్యాన్ వచ్చింది. ఇప్పుడు హుమరాని లహ్యాన్నీ గుణిస్తే  నుసృతుల్ ఖారీజ్ వచ్చింది. ఇది శకున పంక్తి లోని

పదవ స్తానంలో ఉంది .ఇది మంచిది పదవ స్థానం రాజ్య స్థానం మంచిదే !


అందువల్ల  అతని మనసులోని ప్రశ్నకి జవాబు  రాజు  గాని సరి సమానుడైన వ్యక్తి  సహాయం వల్ల  గాని  సోదరునితో వచ్చిన భాగస్వామ్య  ,తగాదాలో  లాభం కలుగుతుంది అని చెప్పడం జరిగింది.


కొసమెరుపు :

ఒక తిండిపోతు వచ్చి రమలఙ్ఞుని “ నేను భోజనం చేసానా లేదా ?” అని అడిగాడు.

అతను పాచికలతో ప్రస్తారం వేసి, ఆ ప్రస్తారంలోని పదవ స్థానాన్ని ( దశమం కర్మ స్థానం) ఆరవ స్థానాన్నీ ( షష్టమం రోగ ఋణ, శత్రు స్థానం అయినా భోజనం చేయడం అనేది ఋణం ఉంటేనే జరుగుతుంది ) అందులోని షకల్లనీ పరిశీలించాడు.ఆ యా స్థానాలలో శుభ మూర్తులు ఉంటే భోజనం  చేసినట్లు, అశుభ మూర్తులు  ఉంటే  చేయనట్లు గ్రహించాలి.


తరువాత సహజంగానే ఏయే పదార్థాలు తిన్నాను? అన్న ప్రశ్న తలెత్తుతుంది కదా! దానికి జవాబు ఇవ్వడానికి , పదవ స్థానంలో అగ్ని తత్వ షకల్,  అగ్ని తత్వ ఖానాలోనే పడితే ,‘మృష్టాన్నంతో  పాటు, చక్కెర  బెల్లంతో తయారయిన తినుబండారాలు, భుజించాడనీ, వాయుతత్వ షకల్ వాయుతత్వ ఖానాలో పడితే, మృష్టాన్నంతో పాటు, తియ్యని  పాలు, పెరుగు, నేతితో  చేసిన  తినుబండారాలు  జలతత్వమయితే, మృష్టాన్నాలతో సహా ఫలాలని కూడా భుజింఛినట్లు, పృథ్వీ తత్వమయితే, మృష్టాన్నాలతో  పాటు,  చూర్ణము, రోటి, అటుకులు మొదలయినవి భుజించాడనీ  తెలుస్తుంది.

*****************

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.