Monthly Archives: September 2011
థ్రిల్
“”వీడెప్పుడు ఇంతేరా, ఉత్త బోర్ గాడు.. ఎప్పుడూ నీతులు చెబుతూంటాడు. అరేయి! వినండిరా, మన యూత్ ఎప్పుడూ సరదాగా ఎంజాయి చేయాలి.అడ్వెంచర్స్ చేయాలి. కాస్త థ్రిల్ అనుభవించాలి. అప్పుడే లైఫ్ లో మజా ఉంటుంది”, అన్నాడు ఈజీ గోయింగ్ దామోదర్.” -శ్రీఖర ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ Continue reading
కథా కథనం – 4
“తమ మనోలోకంలో ఎన్నెన్నో సందేహాలకు సమాధానాలు దొరకక, దొరికినా, దొరికిన వాటిలో చిక్కుముడులు విడదీసుకోలేక, సాహిత్యంలో అలాంటి వాటికి జవాబులు దొరుకుతాయనీ, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అవి విడమరిచి ఉంటాయనీ విని అందుకు సాహిత్యాన్ని ఆశ్రయిస్తారు. సాహిత్యం, అందులో ఒక శాఖ అయిన కథా, ఆ పని చేయగలగాలి.” కథారచనపై కారామాస్టారి పాఠం చదవండి. Continue reading
సత్యప్రభ -మున్నుడి
సత్యప్రభ ఆంధ్రవిష్ణు కాలంనాటి చారిత్రిక నవల. దీనికి మూలకథ వ్రాసినది వాసిష్ట కావ్యకంఠ గణపతి ముని. పూర్తి చేసినది వాసిష్ట. ‘భారతి’ సాహిత్య మాస పత్రికలో 1937లో ఇది ధారావాహికంగా ప్రచురింపబడింది. ఈ నవలను పొద్దులో ధారవాహికగా ప్రచురిస్తున్నాం. ఈ ధారావాహికకు ముందుమాట ఇది. Continue reading
స్మ’రణం’
వచ్చి వున్న నువ్వు విచ్చుకుంటున్న తలపులలోకి వచ్చి చేరాలని తలపడుతూ ఒక పల్లెటూరూ, ఒక నదీ ఒక బాల్యమూ, ఒక వెన్నెలా! నేనిప్పుడు నీవై ఉన్నాను! మోహరించుకుంటున్న జ్ఞాపకాలని ఎన్నిసార్లని ఇలా మోహించుకుంటూ ఆ వెంటవెంటనే శోకించుకుంటూ! వెనక్కి తిరిగి చూడడం నాకు తెలియని విద్యేం కాదు తెలిసీ తెలియని రోజులనుంచే తలపులకొక కిటికీని తగిలించుకుని … Continue reading
విలక్షణ కథా రచయిత – త్రిపుర
త్రిపుర అసలు పేరు: రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (RVTK Rao). 2-9-1928 న గంజాం జిల్లా పురుషోత్తమపురంలో (ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది) జన్మించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో MA ఇంగ్లీషు లిటరేచర్ చదువుకున్నారు…. విలక్షణ రచయిత త్రిపుర గురించిన చిరుపరిచయం చదవండి.
Continue reading
కథాకథనం – 3
కథ కానిది
కథలాగే వార్తా, వార్తాకథ, వ్యాసం కూడా వచనరూపాలే. నిడివిలో, నడకలో, పేరెట్టుకోడంలో ఈ నాల్గింటి మధ్యా ఇటీవల పెద్ద తేడాలు కనిపించవు. ఈ మధ్య ఇవి కూడా కథల్లా ఆరంభమై కథల్లా ముగుస్తున్నాయి.
కథ గురించిన మన అవగాహన మరింత స్పష్టం కావాలంటే – కథ పోలికలున్నా కథలుకాని – వీటి గురించి కూడా తెలుసుకోవాలి. అందువల్ల వీటి నుండి కథ ఏవిధంగా భిన్నమో తెలుస్తుంది.