’రమల్’ ప్రశ్నశాస్త్రం-3

రమల్  పండితులకి  పదహారు  (16) అంకెలో  తీయదనం తెలుసునేమో మరి ! వారి వర్ణమాల  16 మూర్తులతో కూడి ఊంటుంది. అంతే కాదు ప్రశ్న చెప్పేందుకు ఉపయోగించే, 'జాయచా' / 'ప్రస్తారము'  ( జాతక చక్రము లాంటిది )లో కూడ  పదహారు  'ఖానాలు' /' గడులు'  ఉంటాయి. ప్రస్తారము  గురించి చర్చించే ముందు వర్ణమాలలో  విభాగాల   గురించి  తెలుసుకొందాము.

పదహారు మూర్తులని నాలుగు  భాగాలుగా  విభజించడం జరిగింది. 1. ఖారీజ్ షకల్లు , 2. దాఖిల  షకల్లు, 3 సాబిత్  షకల్లు, 4. మున్కిలీబ  షకల్లు. అని. వాటి  ఆకృతులని  బట్టే  ఆ విభజన  చేసారు.

ఖారీజ్  షకల్ కి మీద వరసలో బిందువు, చివరి వరుసలో రేఖ ఉంటాయి.

దాఖిల్ షకల్ కి మీద వరసలో రేఖ, చివరి వరుసలో బిందువు ఉంటాయి.

సాబిత షకల్ కి మీద వరసలోనూ, చివరి వరసలోనూ రేఖలు, మధ్య  వరుసలలో బిందువులు గాని , బిందువు గాని  ఉంటాయి.

మున్కలీబ్ కి మీద  వరసలోనూ , చివరి వరసలోనూ బిందువులు, మధ్య వరసలలో  రేఖలు గాని, రేఖ గాని   ఉంటాయి.
 

ఖారీజ్ షకల్             (లహియాన్,  నుస్రుతుల్ ఖారీజ్, అతవే ఖారీజ్, కబ్జుల్ ఖారీజ్)

__

__

__

__

__

__

__

__

 

 

దాఖిల్  షకల్లు (అంకీష్, నుస్రుతుల్ దాఖిల్,అతవేదాఖిల్, కబ్జుల్ దాఖిల్.)

__

__

__

__

__

__

__

__

 

 

'

సాబిత్ షకల్లు  (జమాత్, హుమరా, బయాజ్, ఇజ్జతమా ) __

__

__

__

__

__

__

__

__

__

__

__

 

మున్కిలీబ షకల్లు

( ఉకలా, ఫరహా, నకీ,

శీతాంశు )

__

__

__

__

 

 

 

ఇప్పుడు 'జాయచా' /' ప్రస్తారము' గురించి తెలుసుకొందాము. జాయచాలో  అయిదు  పంక్తులు ఉంటాయి.

మొదటి పం<క్తిని ' మాతృపంక్తి, అంటారు. ఇందులో  నాలుగు  ఖానాలు / గడులు  ఉంటాయి. ( 1,2,3,4 ఖానాలు )

రెండవ పంక్తిని  ' దుహుతృ పంక్తి' అంటారు. ఇందులో కూడ  నాలుగు  ఖానాలు / గడులు  ఉంటాయి            ( 5,6,7,8 ఖానాలు ).

మూడవ  పంక్తిని ' దౌహితృ పంక్తి' అంటారు. ఇందులో కూడ  నాలుగు  ఖానాలు / గడులు  ఉంటాయి .            ( 9,10,11,12 ఖానాలు )

నాల్గవ  పంక్తిని ' సాక్షి పంక్తి' అంటారు. ఇందులో  కూడ నాలుగు ఖానాలు / గడులు ఉంటాయి. యీ సాక్షి పంక్తిలోని త్రయోదశ ఖానా ప్రశ్న గడికి సాక్షి, చతుర్దశ ఖానాని  ప్రశ్న కర్త మరియు కార్య సిద్ధికి  సాక్షి, పంచాదశ ఖానాని  ప్రస్తారానికి  సాక్షి, షోడశ ఖానాని   ఫలిత  సాక్షి అంటారు.
 

ప్రస్తారం  ఎలా  తయారు  చెయ్యాలో  తెలుసుకొందాం. పాచికలు  ప్రశ్న  కర్త  చేతికిచ్చి,  వాటిని  విసరమని  చెప్తారు. ఆ  పాచికా  ద్వారా నాలుగు  మూర్తులు  ఏర్పడుతాయి. అంటే  మాతృపంక్తి  ఏర్పడుతుందన్న  మాట ! యీ  మాతృ పంక్తి ద్వారా  తక్కిన  ఖానాలు  అన్నీ  తయారు  చేయవచ్చు.


మన  దగ్గర  పాచికలు  లేవు  కదా ! మరేం  చేయాలి ?  అన్న   సమస్యకి  రెండు  విధులు చెప్పారు.

మొదటి విధి : ప్రశ్న కర్తని  శ్వాసని  బిగించి, తన  ప్రశ్నని తలచుకొంటూ,  ఒక  వృత్తాకారాన్ని  కాగితం  మీద  వెయ్యమనాలి. తరువాత  ఆ  వృత్తానికి  కిరణాల  లాగ  రేఖలు  గీయాలి. అంటే సూర్యుని  బొమ్మ  వేయాలన్న  మాట !

దాని Radial Diagram


ఉదాహరణకి  పైన  చూపించిన  విధంగా వృత్తము , దాని  చుట్టూ రేఖలు గీసుకోవాలి. (బొమ్మలో మూడు  రేఖలే  ఉన్నాయి  కదా అని, మూడే  గీయకండీ ! కంప్యూటర్లో సూర్యుని  బొమ్మ దొరకక అలా చేసాను.) ఊపిరి  బిగబెట్టీ పశ్నని  తలచుకొంటూ  మీరు  గీయ  గలిగినన్ని  రేఖలు  గీయండి. తరువాత  ఎన్ని  రేఖలు  గీసారో  లెక్క  పెట్టండి.


ఉదాహరణకి   పన్నెండు  రేఖలు  వచ్చాయనుకొందాము. అంటే  పన్నెండవ  మూర్తిని  మీరు  మొదటి ఖానా /గడిగా ఎంచుకొన్నారన్న  మాట ! మాతృ పంక్తి కోసం  నాలుగు  మూర్తులు  కావాలి  కదా ! మిగతావి  ఎలా  వస్తాయి ?


మొదటి మూర్తి నుండి  ఏడవ  స్థానంలోని మూర్తిని  రెండవ  ఖానాలో మూర్తిగాను, అక్కడి  నుండి  ఏడవ  స్థానంలో  ఉన్న మూర్తిని   మూడవ  ఖానాలో  మూర్తిగాను, అక్కడి  నుండి  ఏడవ  స్థానంలో  ఉన్న  మూర్తిని  నాల్గవ  ఖానాలోని మూర్తిగానూ ఎన్నుకోవాలి. .

ముందుగా ఒక  ప్రస్తారం  కోసం  మూర్తులను  ఎన్నుకొని  చూద్దాం !
 

ప్రశ్నకర్త   30  కిరణాలు / రేఖలు  గీసాడనుకొందాం ! 30 అంటే  16 కన్న  ఎక్కువ  కదా ! అప్పుడేం  చెయాలంటే  30 ని 16 చేత  భాగించాలి. 14  మిగులుతుంది. రమల వర్ణమాలలోని ౧౪వ  మూర్తిని అంటే , 'అతవే దాఖిల్ని' తీసుకోవాలి. దానిని  మాతృ  పంక్తి లోని  ముదటి  ఖానాలోని  మూర్తిగా  గుర్తించాలి. అక్కడినుంచి  లెక్క పెట్టి  ఏడవ  మూర్తిని  అంటే   14,  15  ,16,  తరువాత 1,2,3,4 వరకు  లెక్కపెట్టి,  నాల్గవ  మూర్తిని ,అంటే  'జమాత్'ని  రెండవ  ఖానాలోని  మూర్తిగా  గుర్తించాఇ ! అలాగే  4వ  మూర్తినుండి  ఏడవ మూర్తి  అంటే  4, 5, 6, 7, 8, 9, 10 వరకు లెక్క పెట్టి  10వ మూర్తిని  అంటే , 'నుస్రుతుల్  దాఖిల్ని  మూడవ  ఖానాలోని మూర్తిగా  గుర్తించాలి. మళ్లీ  అలాగే  10  నుండి,  ఏడవ  మూర్తిని లెక్క  పెట్టి  10, 11, 12, 13, 14, 15, 16 వరకు  వచ్చి  16 వ  మూర్తిని  అంటే  1 శీతాంశుని'  నాల్గవ  ఖానాలోని  మూర్తిగా  గుర్తించాలి. వీటిని  కుడి  నుండి  ఎడమకు  వేసుకోవాలి.
 

నాలుగవ ఖానా

తరీఖ్/ శీతాంశు

మూడవ  ఖానా

నుస్రుతుల్  దాఖిల్/ ఉష్ణగు

రెండవ  ఖానా

జమాత్/ సౌమ్య

మొదటి ఖానా

అతవే  దాఖిల్/ కవి.

__

__

__

__

__

__

__

 

 

ఈ విధంగా  ' మాతృ  పంక్తిలోని '   నాలుగు  ఖానాల  లోని  మూర్తులు  వచ్చాయి. ఇక  మిగతా  పంక్తులలో  మూర్తులు  వీటినుండే  తయారవుతాయి.


ఈ నాలుగు  మూర్తుల లోని  మొదటి  వరసలోని  రేఖ/బిందువులని  తీసి  అయిదవ   ఖానాలోని  మూర్తిని  తయారు  చేయాలి. (మొదటి ఖానా లోని మొదటి వరసలో బిందువు ఉంది.రెండవ ఖానా లోని ,మొదటి వరసలో  రేఖ  ఉంది. మూడాచ  ఖానాలోని  మొదటి  వరసలో  రేఖ ఉంది. నాల్గవ  ఖానా లోని మొదటి వరుసలో బిందువు ఉంది ) అంటే(   ౦ , __ ,  ___ , ౦ ) ఉన్నాయి.వీటిని  నిలువుగా  వేసుకొంటూ  పోతే  ' ఉకలా / మందగ్ ' తయారవుతుంది !

అదే విధంగా రెండవ  వరసలోని  ౦  ,  ___ ,  ___ , ౦  , లతో   మళ్లీ  ' ఉకలా / మందగ్  తయారవుతుంది.

ఇక  మూడవ  వరసలోని  ౦,  ___  ,  ౦  ,  ౦  , లతో  'నకీ /  ఆర్ ' తయారయింది

ఆఖరుగా  నాల్గవ  వరసలోని  ___,   ___,   ౦  ,  ౦, లతో  ' నుస్రుతుల్  దాఖిల్ /  ఉష్ణగు  తయారయింది.

అంటే  దుహిత  పంక్తిలోని  ( ౫, ౬, ౭, ౮ )  ఖానాల  లోని  మూర్తులు  క్రమంగా  , ఉకలా,  ఉకలా,  నకీ,  నుస్రుతుల్  దాఖిల్లు  తయారయాయి. దీనిని  బొమ్మలో  చూడండి.

ఎనిమిదవ  ఖానా

నుస్రుతుల్ దాఖిల్ / ఉష్ణగు

ఏడవ  ఖానా

నకీ / ఆర్

ఆరవ  ఖానా

ఉకలా / మందగ్

అయిదవ  ఖానా

ఉకలా / మందగ్

__

__

__

__

__

__

__

 

 

దుహిత  పంక్తి  తరువాత  '  దౌహితృ  పంక్తి  లోని  షకల్లు / మూర్తులు    ఒక  దానినొకటి  గుణకారించడం  వల్ల  తయారవుతాయి.  గుణించడం అంటే  రెండు మూర్తుల లోని  చిహ్నాలని  పరస్పరం  గుణకార  క్రియ ద్వారా కలిపి మరొక  మూర్తిని తయారు చేయడం ! ఈ  గుణకారానికి కొన్ని  నియమాలు  ఉన్నాయి; బిందువుని , బిందువుతో గుణిస్తే రేఖ అవుతుంది. రేఖని రేఖతో  గుణిస్తే  రేఖే  అవుతుంది. బిందువుని , రేఖతో  గుణిస్తే  బిందువే  అవుతుంది. అలాగే  రేఖని, బిందువుతో  గుణిస్తే  బిందువే  అవుతుంది !


కొసమెరుపు : దీనిని  ఉదాహరణ  ద్వారా  తెలుసుకొని  యీ  ప్రశ్నకి   జవాబు  వెతుకుదాం !


ప్రశ్న :  " యాత్ర  జరుగుతుందా లేదా ?

జవాబు :  ప్రస్తారం  లోని  మొదటి  ఖానా లోని  మూర్తి  ప్రశ్నకర్తని,  మూడవ  ఖానాలోని  మూర్తి అతని యాత్రని  గురించి  తెలుపుతాయి,  మన  ప్రస్తారంలోని  మొదటి  మూర్తి  ,'అతవే దాఖిల్'/ కవి  మూడవ  ఖానాలోని  మూర్తి  నుస్రుతుల్  ఖారీజ్ /  ఉష్ణగు  . యీ  రెండింటినీ  గుణిస్తే  ఏమొస్తుంది ?


సమాదానం :  నకీ  / ఆర్  వస్తుంది క్రింద బొమ్మలో చూడండి. '  నకీ ' గురించి , రమల్లో  అశుభ  చిహ్నంగా వర్ణించ బడింది. అందుచేత  యాత్ర  జరగదు  అని  అర్థం !!
 

__

__

__

__

అతవేదాకిల్  ఇంటూ నుస్రుతుల్ దాఖిల్   ఈక్వల్ టూ నకీ / ఆర్  వచ్చింది.

పూర్తి  ప్రస్తారం  గురించి తరువాత  పాఠంలో  తెలుసుకొందాము.


 

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.