Monthly Archives: October 2010
నీరెండ రంగుల్లో
నీరెండ నీడల్లో దిగుల మబ్బుల దారాల అల్లికతో ఏనాటివో జ్ఞాపకాల కలనేతలు ఈ కవితలో.. Continue reading
నీకొక కవిత బాకీ
పచ్చని పదాల పల్లవాలతో చిగురేసే కవిత్వపు మొక్కలు నాటిన చేతులతో తీర్చుకున్న కవిత్వపు బాకీ.
సత్యాన్వేషణ – రెండవ భాగం
“మానవుడు ఆర్థికజీవి. ఆర్థిక పరిస్థితులే అతని దృష్టిని నిర్ణయిస్తున్నాయి. అతని దృష్టి మారాలంటే ఆర్థిక పరిస్థితులు మారాలి. సంఘం రెండు వర్గాలుగా చీలి ఉంది – ధనవంతులు, బీదవాళ్ళు. వాళ్ల దృష్టిని వాళ్ల పరిస్థితి నిర్ణయించింది.” – త్రిపురనేని గోపీచంద్ రాసిన సత్యాన్వేషణ రెండో భాగం చదవండి.
Continue reading
సత్యాన్వేషణ – మొదటిభాగం
సత్యాన్వేషణపై త్రిపురనేని గోపీచంద్ రాసిన వ్యాసాన్ని ఆయన జయంత్యుత్సవ సందర్భంగా ప్రచురిస్తున్నాం.
శారద దరహాసం – 1
విజయదశమి సందర్భంగా పొద్దు నిర్వహించిన పద్యకవిసమ్మేళనం విశేషాలతో కూర్చిన వ్యాస పరంపరలో తొలి వ్యాసాన్ని ఈ విజయదశమి పర్వదినాన సమర్పిస్తున్నాం. శారద దరహాసం పేరుతో నిర్వహించిన ఈ సమ్మేళనం భైరవభట్ల కామేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగింది.
అలనాటి వ్యాసాలు
"గత కాలమే మేలు వచ్చు కాలము కంటే…" అని ఓ కవి గడచిపోయిన కాలం తాలూకుమధురమైన జ్ఞాపకాలలో తేలియాడాడు. గత రాత్రి కురిసిన నీహారికాబిందుసందోహాలనేగా బాలభానుడు కొత్తపొద్దున మెరిపించి, మురిపించి మంచుముత్యాలుగా మార్చేది! అలనాటి తెలుగు సాహిత్యవ్యాసంగాలలో మెరసిన కొన్నిరచనలను "పొద్దు" ఈ తరం పాఠకులకు పరిచయం చేయాలని సంకల్పిస్తున్నది.
విమర్శ ప్రమాణము
"వజ్ర పరీక్ష ఎంత కష్ట సాధ్యమైనదో అంతకంటే సహస్రగుణము కావ్యపరీక్ష కష్టసాధ్యమైనది. వజ్రపరీక్షకు ఒక వజ్ర ప్రపంచము తెలిస్తే చాలును కానీ కావ్య విమర్శకు కావల్సిన సామాగ్రి అపరిమితమైనది." విమర్శ గురించి నోరి నరసింహశాస్త్రి గారు 1944 లో ఆంధ్ర పత్రికలో ప్రకటించిన వ్యాసంలో మరిన్ని విశేషాలు చదవండి.
నాలుగు కవిత్వపు మెతుకులు – 2
"నేను చూసిన అన్ని మరణాలూ నాకు బాధ కలిగించాయి. ఏ మనిషి జీవితం సందేశం అవుతుందో లేదో తెలీదు గాని, ప్రతి మరణమూ నాకు వొక సందేశం, వొక సందేహం.", అని అంటున్నారు అఫ్సర్ తన ఇంటర్వ్యూ రెండో భాగంలో.