కవిత

-ఆత్రేయ కొండూరు

తలపు తడుతూ నేల గంధం
తలుపు తీస్తే,

ఆకాశం కప్పుకున్న
అస్థిరమయిన రూపాలు
తేలిపోతూ, కరిగిపోతూ,
అలజడిచేస్తూ,
అక్షరాల జల్లు.

నిలిచే సమయమేది ?
పట్టే ఒడుపేది ?

పల్లంలో దాగిన
జ్ఞాపకాల వైపు ఒకటే పరుగు.

తడుపుదామనో
కలిసి తరిద్దామనో!

గుండె నిండేసరికి
నిర్మలాకాశం
వెచ్చగా మెరిసింది.

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

2 Responses to కవిత

  1. ramnarsimha says:

    ఆత్రేయ గారు,
    “తలపు తడుతూ నేల గంధం
    తలుపు తీస్తే”
    అనే కవితా పంక్తి….చాలా బాగుంది..
    అభినందనలు..

  2. rd says:

    pallamlo daagina jnaapakaala vaipu anadam baagundi.

Comments are closed.